iDreamPost

తీవ్రంగా గాయపడ్డ రేణు దేశాయ్‌.. వేలు చితికిపోయిందంటూ పోస్ట్‌!

  • Published Jun 28, 2023 | 1:30 PMUpdated Jun 28, 2023 | 3:00 PM
  • Published Jun 28, 2023 | 1:30 PMUpdated Jun 28, 2023 | 3:00 PM
తీవ్రంగా గాయపడ్డ రేణు దేశాయ్‌.. వేలు చితికిపోయిందంటూ పోస్ట్‌!

ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది రేణు దేశాయ్‌. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో వివాహం, విడాకుల వంటి విషయాల వల్ల ఆమె పేరు తరచుగా మీడియాలో వినిపిస్తుంది. నటిగా, దర్శకురాలిగా.. మంచి పేరు సంపాదించుకున్నారు రేణు దేశాయ్‌. కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రేణు దేశాయ్‌.. ఇప్పుడిప్పుడే పరిశ్రమలో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. రవితేజ హీరోగా నటిస్తోన్న టైగర్‌ నాగేశ్వరావు చిత్రంలో పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తూ.. సాలిడ్‌ కమ్‌బ్యాక్‌ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో రేణు దేశాయ్‌.. రవితేజ సోదరి పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

ఇక సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు రేణు దేశాయ్‌. తనకు, తన పిల్లలకు సంబంధించిన వివరాలను.. ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఉంటారు. అకిరాకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు చేరవేస్తారు. తాజాగా అకీరానందన్ వర్కౌట్స్ వీడియో ఒకటి పోస్ట్ చేసి.. తనకు చాలా గర్వంగా ఉందంటూ క్యాప్షన్‌​ పెట్టింది. ఇక తాజాగా రేణు దేశాయ్‌ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలింతకు రేణు దేశాయ్‌కు ఏం జరిగిందో తెలియాలంటే.. ఇది చదవాలి…

ఈ పోస్ట్‌లో రేణు దేశాయ్‌ తనకు ప్రమాదం జరిగిందని తెలిపింది. రెండు రోజుల క్రితం తన కాలికి తీవ్రమైన గాయం అయ్యిందని.. దాంతో తన కాలి మూడు వేళ్ళు చాలా దెబ్బతిన్నాయని ముఖ్యంగా ఒక వేలు చితికిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది రేణు దేశాయ్‌. గాయం అయినా సరే.. దాన్ని ఏమాత్రం ఏ లెక్క చేయకుండా.. అలానే బీచ్‌లో నడుచుకుంటూ ఏంజాయ్‌ చేసింది. అయితే తన కాలికి గాయం ఎలా అయ్యిందన్న విషయం మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ పోస్ట్‌ చూసిన అభిమానులు.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి