P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగా కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆదాయపన్నుశాఖ తీపి కబురును అందించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వ ఉద్యోగా కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆదాయపన్నుశాఖ తీపి కబురును అందించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
P Venkatesh
మీరు టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? గవర్నమెంట్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆదాయపన్నుశాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ దేశంలో పన్ను చట్టాలను అమలు చేసి పన్నులను వసూలు చేస్తుంటుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఐటీ శాఖలో మీరు ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. మంచి జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ కొలువును సాధించి జీవితంలో సెటిల్ అయిపోవచ్చు. అయితే ఈ ఉద్యోగాలు వారికి మాత్రమే కేటాయించబడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ముంబయిలోని ఆదాయపన్ను శాఖ స్పోర్ట్స్ కోటా కింద పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 291 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడాకారులకు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు జనవరి 19 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఐటీ శాఖ అధికారిక వెబ్ సైట్ https://incometaxmumbai.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.