P Venkatesh
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురును అందించింది. గుంటూరు జిల్లాలోని మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురును అందించింది. గుంటూరు జిల్లాలోని మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
P Venkatesh
మీరు 7వ తరగతి పాసయ్యారా? ఏడవ తరగతితో చదువు ఆపేయాల్సి వచ్చిందా? అయినా పర్లేదు. మీ కోసం నెలకు 23 వేలు జీతం ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 7వ తరగతి నుంచి పీజీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉన్న వారు ఈ నోటిఫికేషన్ ను అసలు వదలొద్దు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను బట్టి రూ. 15 వేల నుంచి రూ. 61 వేల వరకు జీతం పొందొచ్చు. ఏడో తరగతి పాసైన వారు నెలకు 23 వేలు జీతంగా పొందవచ్చు.
గుంటూరులోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 94 ఉద్యోగాలన కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. గుంటూరులోని జీఎంసీ, జీజీహెచ్, ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో ఈ ఖాళీలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 30 2023 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిక వెబ్ సైట్ ను https://guntur.ap.gov.in/ పరిశీలించాల్సి ఉంటుంది.