iDreamPost
android-app
ios-app

కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్.. నెలకు 80 వేల జీతం.. మీరూ ట్రై చేయండి

  • Published Oct 28, 2024 | 5:11 PM Updated Updated Oct 28, 2024 | 5:11 PM

India Seeds NSCL Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే నెలకు 80 వేల జీతంతో సెంట్రల్ జాబ్స్ రెడీగా ఉన్నాయి. వెంటనే అప్లై చేసుకోండి.

India Seeds NSCL Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే నెలకు 80 వేల జీతంతో సెంట్రల్ జాబ్స్ రెడీగా ఉన్నాయి. వెంటనే అప్లై చేసుకోండి.

  • Published Oct 28, 2024 | 5:11 PMUpdated Oct 28, 2024 | 5:11 PM
కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్.. నెలకు 80 వేల జీతం.. మీరూ ట్రై చేయండి

టెన్త్, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఇలా ఏదో ఒక విద్యార్హత కలిగి ఉద్యోగాలు లేక అల్లాడిపోతుంటారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక చిన్న చిన్న పనులు చేస్తూ జీవిస్తుంటారు. జాబ్ దొరకలేదన్న టెన్షన్, ఇంట్లో వాళ్ల నుంచి చివాట్లు నిరుద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏదైనా మంచి జాబ్ దొరికితే బాగున్ను అని భావిస్తుంటారు. జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. కానీ, ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ లలో కాంపిటీషన్ హెవీగా ఉంది. ఉద్యోగం సాధించడం గగనమైపోయింది. ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా లక్షల్లో పోటీపడుతున్నారు. పోటీ ఎంతున్న గట్టిగ ప్రయత్నిస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నట్లైతే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.

సెంట్రల్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ సీడ్స్‌ కార్పొరేషన్ లిమిటెడ్ భారీ వేతనంతో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేషనల్ సీడ్స్‌ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్ట్ ప్రాతిపదికన 188 జాబ్స్ ను భర్తీ చేయనున్నది. విభాగాల వారీగా డిప్యూటీ జనరల్ మేనేజర్ 01, అసిస్టెంట్ మేనేజర్ 01, మేనేజ్‌మెంట్ ట్రైనీ 05, సీనియర్ ట్రైనీ 02, డిప్యూటీ జనరల్ మేనేజర్ 01, ట్రైనీ 179 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, బీఈ/బీటెక్, ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 50, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30, మిగతా పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.

ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్లు.. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.1 లక్ష 41 వేల 260.. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.80 వేల 720.. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.57 వేల 920.. సీనియర్ ట్రైనీ పోస్టులకు రూ.31 వేల 856.. ట్రైనీ పోస్టులకు రూ.24 వేల 616 జీతం ఉంటుంది. అప్లై చేసుకోదలిచిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 30 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం www.indiaseeds.com ను సందర్శించాల్సి ఉంటుంది.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş