భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం! కూతురు అడ్డుగా ఉందని..!

ఈ రోజుల్లో భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త.. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాలు ఏర్పరుచుకుని పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. కాదు, కూడదని ఎవరైనా వాదిస్తే వారిని అడ్డు తొలగించడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే, అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ తల్లి.. ప్రియుడితో గడిపేందుకు కూతురు అడ్డుగా ఉందని దారుణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలోని బసవేశ్వర కాలనీలో ఓ మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు జన్మించింది. ఇకపోతే, ఈ మహిళ గత కొంత కాలం నుంచి విభేదాల కారణంగా భర్తకు దూరంగా కాపురం పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రియుడితో గడిపేందుకు కూతురు అడ్డుగా ఉందని ఆ తల్లి దారుణానికి పాల్పడింది. రెండో తరగతి కూతురి ఒంటిపై వాతలు పెట్టి హింసించింది.

ఇదే విషయాన్ని స్కూల్ టీచర్లు గమనించారు. ఏం జరిగిందని ఆ విద్యార్థిని ప్రశ్నించగా.. ఆ చిన్నారి జరిగిందంతా వివరించింది. దీంతో స్కూల్ టీచర్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ చిన్నారి తల్లిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియుడితో గడిపేందుకు కూతురు అడ్డుగా ఉందని వాతలు పెట్టిన ఈ దుర్మార్గురాలి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది  కూడా చదవండి: ఇంతకంటే దారుణం ఉంటుందా? మద్యానికి బానిసై కొడుకును అమ్మేసిన తండ్రి!

Show comments