iDreamPost
android-app
ios-app

డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం.. పరారీలో హీరో నవదీప్‌!

డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం.. పరారీలో హీరో నవదీప్‌!

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ డ్రగ్స్‌ కేసులో ప్రముఖ తెలుగు హీరో నవదీప్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి నవదీప్‌ కస్టమర్‌గా ఉన్నట్లు సీపీ ఆనంద్‌ తెలిపారు. నవదీప్‌ పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే కేసుకు సంబంధించి మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. డ్రగ్స్‌ వాడకాన్ని ప్రోత్సహించేలా ఉందంటూ బేబీ సినిమాపై కూడా సీపీ ఫైర్‌ అయ్యారు. బేబీ సినిమా వాళ్లకు నోటీసులు పంపుతామన్నారు.

కాగా, ఈ డ్రగ్స్‌ కేసులో తాజాగా మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా అరెస్టయిన వారిలో సినీ నిర్మాత సుశాంత్ రెడ్డి  కూడా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ వినియోగిస్తుండంగా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. వారి దగ్గరినుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల కొకైన్‌, 24 ఎక్టసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక, గతంలో అరెస్టయిన వారిని పోలీసులు రిమాండ్‌ తరలించారు. వారిని గత మూడు రోజులుగా విచారిస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో మరికొంతమందిని అరెస్ట్‌ చేయనున్నారు. అయితే, డ్రగ్స్‌ కేసు వ్యవహారంపై నవదీప్‌ తాజాగా స్పందించారు. తనకు డ్రగ్స్‌ కేసుతో ఎటువంటి సంబంధం లేదని అన్నారు. తాను ఎక్కడికీ పారి పోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని అన్నారు.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobet giriş