Meerpet Crime News On Jan 31 2024: హైదరాబాద్‌: ఆ నీచుడు చేసిన పనికి తట్టుకోలేక.. యువతి దారుణ నిర్ణయం

హైదరాబాద్‌: ఆ నీచుడు చేసిన పనికి తట్టుకోలేక.. యువతి దారుణ నిర్ణయం

కుటుంబానికి అండగా నిలవాలని భావించి ఉద్యోగం చేస్తున్న ఓ యువతి.. యజమాని చేసిన పని తట్టుకోలేక దారుణం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

కుటుంబానికి అండగా నిలవాలని భావించి ఉద్యోగం చేస్తున్న ఓ యువతి.. యజమాని చేసిన పని తట్టుకోలేక దారుణం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ఆడవారికి ఇంట్లోనే రక్షణ ఉండటం లేదు.. ఇక సమాజం సంగతి ప్రత్యేకంగా చెప్పాలా. నేటి కాలంలో మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా నెలల చిన్నారులు మొదలు కాటికి కాళ్లు చాపిన ముసలి వాళ్ల వరరు ఎవరిని వదలడం లేదు మృగాళ్లు. ఆడవాళ్లని చూడగానే ఏం మాయరోగం పుడుతుందో తెలియదు.. తనకు జన్మనిచ్చిన తల్లి కూడా ఆడదే అనే విషయం గుర్తు రాదేమో రాక్షసులకు. అయినా కడుపున పుట్టిన వారినే వదలని కామాంధులున్న ఈ లోకంలో.. పరాయి ఆడవాళ్లను విడిచిపెడతారనుకోవడం ముర్ఖత్వం. ప్రపంచంలో ప్రతి నిమిషం ఏదో చోట ఒక మహిళ, ఆడపిల్లపై అత్యాచారం జరుగుతుంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. యజమాని అత్యాచారయత్నం చేయడంతో.. ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాలు..

సెలూన్‌ యజమాని అత్యచారయత్నానికి ఓడిగట్టడంతో.. దాన్ని భరించలేకపోయిన యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మీర్పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టీచర్స్‌ కాలనీలో ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవరకొండకు చెందని దివ్య(18) తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు నేపథ్యంలో.. హైదరాబాద్‌ వచ్చి జాబ్‌ చేస్తుంది. మీర్పేట్‌, టీచర్స్‌ కాలనీలో ఉన్న దీ బాబ్‌ సెలూన్‌లో పని చేస్తుండేది. ఈ క్రమంలో ఆ షాప్‌ యజమాని అయిన మురళి గత కొన్నాళ్లుగా దివ్యను లైంగికంగా వేధిస్తున్నాడు.

తన కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో.. జాబ్‌ తనకు కచ్చితంగా అవసరం.. మానేయలేదు. ఇటు చూస్తేనేమో యజమాని వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో బయట ఎక్కడైనా మరో ఉద్యోగం చూసుకోవాలని భావించింది దివ్య. ఆ ప్రయత్నాల్లో ఉండగానే దారుణం చోటు చేసుకుంది. మంగళవారం డ్యూటీ నిమిత్తం సెలూన్‌కి వెళ్లింది దివ్య. ఆమె రావడం గమనించిన మురళి.. షాప్‌లో ఉన్న ఓ గదిలోకి ఆమెని లాక్కెళ్లి.. అత్యాచారయత్నం చేశాడు. ఎలాగోలా అతడి నుంచి తప్పించుకున్న దివ్య.. బయటకు వచ్చి కేకలు వేసింది. దాంతో మురళి అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే యజమాని చేసిన పని వల్ల తీవ్ర మనస్థాపానికి గురైన దివ్య దారుణ నిర్ణయం తీసుకుంది.

సెలూన్‌లో ఉన్న శానిటైజర్‌ తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మీర్పేట్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సెలూన్‌ యజమాని మురళి మీద కేసు నమోదు చేశారు. దివ్య తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆడపిల్ల అయినా సరే కుటుంబానికి అండగా నిలబడాలనుకుంటే.. ఓ మృగాడి వల్ల ఏకంగా ఆమె ప్రాణాలే పోయాయి. కుమార్తె మరణించిన వార్త తెలుసుకుని.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.

Show comments