Hyderabad Crime News: ప్రేమించి పెళ్లి.. ఇంట్లో ఎవరూ లేరని..!

ప్రేమించి పెళ్లి.. ఇంట్లో ఎవరూ లేరని..!

ఈమె పేరు ప్రవళిక, వయసు 25 ఏళ్లు. గత ఐదేళ్ల కిందట స్థానికంగా ఉండే ఓ యువకుడిని ప్రేమించింది. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని భావించి పెద్దలు ఒప్పించి పెళ్లి మరీ చేసుకున్నారు. కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అలా చాలా కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ, ఏం జరిగిందో ఏమో కానీ.. ప్రవళిక ఉన్నట్టుండి తాజాగా ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆ యువతి తీసుకున్న నిర్ణయానికి ఆమె కుటుంబ సభ్యులు గుండెలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ పరిసర ప్రాంతమైన మూడు చింతలపల్లి మండలం కొల్తూరు గ్రామానికి ప్రవళిక (25), లాల్ గడీ మలక్ పేట్ కు చెందిన రమేష్ గతంలో ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని భావించి 5 ఏళ్ల కిందట పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. కానీ, ఏం జరిగిందో ఏమో కానీ.. ప్రవళిక ఆదివారం సంచలనం నిర్ణయం తీసుకుంది.

ఆ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రవళిక కుటుంబ సభ్యులు షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే ఈ ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Show comments