Hyderabad Cyberabad Crime News: రూమ్ షేరింగ్ కోసం యువకుడి ప్రకటన.. కాంటాక్ట్ అయిన వేశ్య, తర్వాత జరిగింది ఇదే!

రూమ్ షేరింగ్ కోసం యువకుడి ప్రకటన.. కాంటాక్ట్ అయిన వేశ్య, తర్వాత జరిగింది ఇదే!

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ వేశ్య అన్ని సంగతి దాచి ఓ యువకుడితో కలిసి రూమ్ లో ఉంది. కానీ, అసలు విషయం వెలుగులోకి రావడంతో యువకుడు షాక్ గురయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ వేశ్య అన్ని సంగతి దాచి ఓ యువకుడితో కలిసి రూమ్ లో ఉంది. కానీ, అసలు విషయం వెలుగులోకి రావడంతో యువకుడు షాక్ గురయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఓ యువకుడు గత కొంత కాలంగా హైదరాబాద్ లోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నగరంలోని ఓ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. రోజూ ఆఫీసుకు వెళ్లి తిరిగి రూమ్ కు వచ్చేవాడు. అయితే, చాలా కాలం నుంచి ఆ యువకుడు ఒంటరిగా ఉండడంతో ఇటీవల షేరింగ్ కోసమని ఓ ప్రముఖ వెబ్ సైట్ లో ప్రకటన ఇచ్చాడు. దీన్ని చూసిన ఓ మహిళ.. వెంటనే ఆ యువకుడిని కాంటాక్ట్ అయింది. దీంతో ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇద్దరు ఒకే రూమ్ లోకి కలిసి ఉన్నారు. ఆ మహిళ వేశ్య అన్న సంగతి చెప్పకుండా ఆ యువకుడితో ఉంటూ వచ్చింది. ఇక అసలు విషయం అతనికి తెలియడంతో ఆ యువకుడు షాక్ కు గురయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కిరణ్ కుమార్ అనే యువకుడు హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతడు గతంలో హాస్టల్ లో ఉండేవాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని నగరంలోని వెంగళరావు నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అప్పటి నుంచి కిరణ్ కుమార్ ఒంటరిగా ఉంటూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ యువకుడు రూమ్ షేరింగ్ కోసమని ఓ ప్రముఖ వెబ్ సైట్ లో యాడ్ ఇచ్చాడు. ఇది చూసిన ఓ మహిళ.. వెంటనే కిరణ్ కుమార్ ను కాంటాక్ట్ అయింది. దీంతో ఇద్దరు మాట్లాడుకుని అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు అదే రూమ్ లో కలిసి ఉన్నారు.

ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. వీళ్లు కూకట్ పల్లికి మకాం మార్చారు. అక్కడికి వెళ్లాక ఇద్దరు ఎంతో సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. కట్ చేస్తే.. తాను వేశ్యనని ఆ మహిళ.. కిరణ్ కుమార్ తో ఇటీవల చెప్పింది. ఆమె మాటలు విన్న ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. తన రూమ్ నుంచి వెళ్లిపోమని కిరణ్ కుమార్ ఆమెకు తెలిపాడు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఇన్నాళ్లు ఆమె కిరణ్ తో సన్నిహితంగా దిగిన ఫోటోలను చూపించి ఆ మహిళ బ్లాక్ మెయిల్ కు దిగింది. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు నన్ను శారీరకంగా వాడుకుని మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఏ మాత్రం సంతృప్తి చెందని ఆ మహిళ.. పక్కా ప్లాన్ తో కిరణ్ కుమార్ వద్ద నష్టపరిహారం కింద ఏకంగా రూ. 4.7 లక్షలు గుంజింది. అంతేకాదు ఆ మహిళ ఇటీవల కొందరు వ్యక్తులతో కిరణ్ కుమార్ పై దాడి కూడా చేయించింది. దీంతో కిరణ్ కుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నెటిజన్స్ స్పందిస్తున్నారు. పరిచయం లేనివారితో రూమ్ షేర్ చేసుకుంటే ప్రమాదమని అంటున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments