ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు! కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన

ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు! కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన

పైన ఫొటోలో నవ్వుతూ కనిపిస్తున్న వివాహిత పేరు శ్రీనిఖ. గతేడాది ఓ యువకుడితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ దంపతులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వివాహిత ప్రస్తుతం 5 నెలల గర్బిణీ కావడం విశేషం. దీంతో భర్త భార్యను అన్ని రకాలుగా సంతోషంగా చూసుకుంటూ ఉన్నాడు. కాగా శ్రీనిఖ తరుచు వైద్యుడిని సంప్రదిస్తూ చెకప్ కోసం వెళ్లేది. అయితే ఉన్నట్టుండి జరిగిన ఓ ప్రమాదంలో శ్రీనిఖ ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతితో భర్త, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనిఖకి గతేడాది ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ దంపతులు ఎంతో సంతోషంగానే ఉన్నారు. అయితే ఈ వివాహిత ప్రస్తుతం 5 నెలల గర్భిణీ కావడం విశేషం. ఇదిలా ఉండగా.., శ్రీనిఖ చెకప్ కోసం ఇటీవల హైదరాబాద్ లోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. చెకప్ చేసుకుని చందానగర్ లోని ఓ కాలనీలో ఉంటున్న తన బాబాయ్ ఇంటికి వెళ్లింది. గత రెండు మూడు రోజుల నుంచి శ్రీనిఖ అక్కడే ఉంది. అయితే వీళ్లు రెండవ అంతస్తులో ఉంటున్నారు. ఇకపోతే… శ్రీనిఖ గురువారం ఉదయం బాల్కనిలో వాకింగ్ చేస్తూ ఉంది. దీంతో ప్రమాదవశాత్తు ఆ వివాహిత రెండవ అంతస్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది.

దీంతో ఆమె ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫలితం లేకపోవడంతో ఈ వివాహిత చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి భర్త, ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదని ఆమె బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

ఇది కూడా చదవండి: ప్రముఖ జర్నలిస్ట్‌ దారుణ హత్య!

Show comments