హైదరాబాద్ లో దారుణం.. 8 తరగతి విద్యార్థినితో PET గలీజ్ పనులు!

హైదరాబాద్ లో దారుణం.. 8 తరగతి విద్యార్థినితో PET గలీజ్ పనులు!

ఈ రోజుల్లో కొందరు గురువులు విద్యార్థినిలకు చదువు చెప్పాల్సింది పోయి ప్రేమ పాఠాలు చెబుతున్నారు, ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తూ పవిత్రమైన వృత్తికే మచ్చ తెస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. అయితే అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ PET 8 తరగతి విద్యార్థినితో పాడు పనులకు తెర లేపాడు. ఇదే విషయం ఆ బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో నేరుగా స్కూల్ కు వెళ్లి ఆఫీసు ఫర్నీచర్ ను పగలగొట్టారు. ఇంతే కాకుండా స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ అత్తాపూర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో విష్ణు అనే యువకుడు PETగా పని చేస్తున్నాడు. కాగా, ఇదే స్కూల్ లో చదువుకుంటున్న 8వ తరగతి విద్యార్థినితో విష్ణు తరుచు మాట్లాడే ప్రయత్నం చేసేవాడట. దీన్నే అదునుగా భావించిన విష్ణు.. ఆమెతో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అతని వేధింపులను ఆ విద్యార్థిని తట్టుకోలేక ఇటీవల తల్లిదండ్రులకు వివరించింది. ఈ విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. వెంటనే బంధువులతో కలిసి అత్తాపూర్ లో ఉన్న ఆ స్కూల్ కు వెళ్లారు. నిందితుడు PET విష్ణు ఎక్కడా అని ప్రశ్నించారు.

ఇదే కాకుండా ఆఫీసు ఫర్నీచర్, కంప్యూటర్లు వంటి వస్తువులు పగల గొట్టి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై దాడి చేసినట్లు తెలుస్తుంది. అనంతరం బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు PET విష్ణు సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. 8వ తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన PETతీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: తహసీల్దార్‌ వేధింపులు తాళలేక మహిళా ఉద్యోగిని ఆత్మహత్య!

Show comments