iDreamPost
android-app
ios-app

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరారీ అంటూ వార్తలు.. క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్!

  • Published Dec 20, 2023 | 1:55 PMUpdated Dec 20, 2023 | 3:22 PM

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడంటూ వస్తోన్న వార్తలపై తాజాగా అతడు స్పందించాడు. తాను ఎక్కడికీ పారిపోలేదంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వివరాలు..

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడంటూ వస్తోన్న వార్తలపై తాజాగా అతడు స్పందించాడు. తాను ఎక్కడికీ పారిపోలేదంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వివరాలు..

  • Published Dec 20, 2023 | 1:55 PMUpdated Dec 20, 2023 | 3:22 PM
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరారీ అంటూ వార్తలు.. క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్!

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ అభిమానులు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని.. రణరంగం సృష్టించారు. పల్లవి ప్రశాంత్ అభిమానులైతే.. అమర్ కారు మీద దాడి చేయడమే కాక.. వెంటాడి మరీ వేధించారు. కొందరు.. ఇతర కంటెస్టెంట్ల కార్ల మీద దాడి చేయడమే కాక.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. అంతేకాక అభిమానుల దాడుల్లో ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇక కేసు నమోదు కావడంతో రైతు బిడ్డ పరారీలోకి వెళ్లాడంటూ వార్తలు వచ్చాయి. అయితే అవి నిజం కాదని.. తాను ఎక్కడికి పోలేదంటూ పల్లవి ప్రశాంత్ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వివరాలు..

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఫోన్ స్విచ్చాఫ్‌ చేశాడంటూ ఉదయం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై ప్రశాంత్ స్పందిస్తూ.. తాను ఎక్కడికీ పోలేదని.. తన ఇంట్లోనే ఉన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఇక ప్రశాంత్ పక్కనే కొంతమంది యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లు, ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించాడు ప్రశాంత్. అంతేకాక తనపై కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. ఎవరో చేసిన తప్పుకు తనను అనడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించాడు.

pallavi prasanth react about his issue

వీడియోలో ఏం చెప్పాడంటే..

పల్లవి ప్రశాంత్ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘జై జవాన్ జై కిసాన్.. అన్నా నేను ఎక్కడికీ పోలేదు. అవన్నీ తప్పుడు వార్తలు. నేను మా ఇంటి దగ్గరే ఉన్నాను. బరాబర్ ఇంటికాడనే ఉన్నా. అన్నా వాళ్లు కూడా ఇక్కడే ఉన్నారు. కావాలంటే వారితో మాట్లాడిస్తాను’’.. అని పక్కనే ఉన్న అయ్యప్ప మాలధారుడితో మాట్లాడించాడు.‘‘ స్వామీ మీరే చెప్పాలి నేను పరారీలో ఉన్నాను అంటున్నారు. మీరే చెప్పండి” అంటూ తన పక్కన ఉన్న స్వాములతో మాట్లాడించాడు ప్రశాంత్.

తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి..

అనంతరం పక్కనే ఉన్న స్వామి మాట్లాడుతూ.. “పల్లవి ప్రశాంత్ ఎక్కడికీ పోలేదు. ఇంటి దగ్గరే ఉన్నాడు. నిన్న పడి పూజ ఉండే.. ప్రశాంత్ నువ్వు ఖచ్చితంగా రావాలి అని పిలిచినా. ప్రతీ ఏడాది వచ్చే వాడు. కానీ ఈ సారి అన్నా ఇంటికి అందరూ వస్తున్నారు.. రావడానికి కుదరదు అని చెప్పాడు. అన్నా.. వచ్చిన వాళ్లతో నేను ఫొటోలు దిగకపోతే బావుండదు.. వాళ్లంతా నన్ను చూడటం కోసం ఎంతో దూరం నుంచి వచ్చారు. నువ్వు ఎప్పుడూ కలిసే వాడివే.. ఏమనుకోకు తప్పు అయింది అన్నాడు.. సరే నువ్వు ఏం టెన్షన్ పడకు ప్రశాంత్.. నేనే నీ దగ్గరకి వస్తానని చెప్పాను. ఈ రోజు నేను ప్రశాంత్ దగ్గరకి వచ్చాను. ఇంతకు ముందే న్యూస్ ఛానల్స్‌లో ప్రశాంత్ పరారీలో ఉన్నాడు.. అక్కడున్నాడు ఇక్కడున్నాడని వార్తలు వేస్తున్నారు. అవన్నీ అబద్ధాలు. ప్రశాంత్ ఇక్కడే ఉన్నాడు. తప్పుడు వార్తలు రాయకండి. ఎందుకంటే ఒక మనిషి జీవితమిది” అన్నాడు.

ప్రశాంత్ మాట్లాడుతూ.. “నన్ను కలవడానికి చాలా మంది వేరే వేరే ఊర్ల నుంచి వస్తున్నారు. నేను ఎక్కడికి పోలేదు. నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే దయ చేసి నన్ను క్షమించండి.. నేను ఏ తప్పు చేయలేదు.. ఎవరెవరో చేసినవి నా మీద వేస్తున్నారు. కావాలని నన్ను నెగెటివ్ చేయడానికే ఇవన్నీ చేస్తున్నారు.. నేను ఎక్కడికి పోను. పరారీలో ఉన్నానంటూ వచ్చిన న్యూస్ చూసి నేనే షాక్ అయ్యాను. నా ఫోన్ స్విఛాఫ్ వస్తుందంటే.. నేను వచ్చినప్పటి నుంచి ఫోనే పట్టుకోలేదు.. పాత ఫోనులో వీడియోలు తీసుకున్నా తప్ప కొత్త ఫొన్ ముట్టుకోలేదు.. దయచేసి మీరే ఆలోచించండి.. నేను ఇంటి దగ్గరే ఉన్నాను.. ఎక్కడికి పోలేదు. టెన్షన్ పడకండి” అంటూ తన పరారీ వార్తలపై రియాక్ట్ అయ్యాడు ప్రశాంత్.

 

View this post on Instagram

 

A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి