iDreamPost

Rishabh Pant: టీమిండియాపై సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్.. పంత్ వచ్చే దాకా అతనే గతి!

  • Published Jan 08, 2024 | 5:01 PMUpdated Jan 08, 2024 | 5:01 PM

టీమిండియాపై ఓ సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రిషబ్ పంత్ వచ్చే దాకా జట్టుకు అతడే గతి అన్నాడు. ఆ మాజీ ఆటగాడు ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియాపై ఓ సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రిషబ్ పంత్ వచ్చే దాకా జట్టుకు అతడే గతి అన్నాడు. ఆ మాజీ ఆటగాడు ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 08, 2024 | 5:01 PMUpdated Jan 08, 2024 | 5:01 PM
Rishabh Pant: టీమిండియాపై సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్.. పంత్ వచ్చే దాకా అతనే గతి!

క్రికెట్​లో సంప్రదాయ ఫార్మాట్​గా చెప్పుకునే టెస్టుల్లో ఆడటం అంత ఈజీ కాదు. ముఖ్యంగా బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. నిప్పులు చెరిగే వేగంతో దూసుకొచ్చే బంతుల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్​ట్రా పేస్, స్వింగింగ్ డెలివరీస్​తో పాటు గింగిరాలు తిరిగే స్పిన్​నూ ఎదుర్కొని క్రీజులో నిలవాలి. దీనికి ఎంతో ఓపిక, సంయమనంతో పాటు మంచి టెక్నిక్ అవసరం. భారత బ్యాటర్లకు విదేశాల్లో ఎక్కువగా సవాళ్లు ఎదురవుతాయి. పేస్, బౌన్సీ పిచ్​లపై ఫారెన్ పేస్ బౌలర్లను తట్టుకొని రన్స్ చేయడంలో మన బ్యాటర్లు తరచూ ఫెయిల్ అవుతుంటారు. అయితే విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె, రిషబ్ పంత్ లాంటి వాళ్లు వచ్చినప్పటి నుంచి ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. టెక్నిక్​తో పాటు ఓపికతో ఆడితే ఫారెన్ పిచ్​ల మీద రన్స్‌ చేయడం ఈజీ అని వీళ్లు నిరూపించారు. అలాంటి పంత్, కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

స్వదేశంతో పాటు విదేశాల్లోనూ టెస్ట్ క్రికెట్​లో అద్భుతంగా రన్స్ చేస్తున్న వారిలో విరాట్ కోహ్లీ ఒకడు. లాంగ్ ఫార్మాట్​లో సేనా దేశాలపై రన్స్ విషయంలో అతడికి ఉన్న రికార్డు ప్రస్తుత ఆసియా ప్లేయర్లలో ఎవరికీ లేదు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్​ల సిరీస్​లోనూ కోహ్లీ దుమ్మురేపాడు. ఈ నేపథ్యంలో అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తాడు సంజయ్ మంజ్రేకర్. కోహ్లీ అందిస్తున్న సేవలకు భారత జట్టు ఎంతో రుణపడి ఉంటుందన్నాడు. విరాట్ లాంటి ప్లేయర్​ టీమిండియాలో ఉన్నందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని మంజ్రేకర్ తెలిపాడు. సౌతాఫ్రికా టూర్​లో కోహ్లీ ఆడిన తీరు అద్భుతమని.. అతడికి వేరే బ్యాటర్లకు మధ్య స్పష్టమైన తేడా కనిపించిందన్నాడు. టీమ్​లోని మరో బెస్ట్ బ్యాటర్ రిషబ్ పంత్ వచ్చే దాకా భారత జట్టుకు కోహ్లీనే గతి అన్నాడు మంజ్రేకర్.

రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ మీదా మంజ్రేకర్ రియాక్ట్ అయ్యాడు. లాంగ్ ఫార్మాట్​లో ఎప్పటిదాకా కంటిన్యూ అవ్వాలనేది హిట్​మ్యాన్ ఇష్టమన్నాడు. అయితే రోహిత్​కు పర్ఫెక్ట్ రీప్లేస్​మెంట్ మాత్రం లేదన్నాడు. అతడికి టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. ఇది మాటల ద్వారా తెలిసిపోతుందన్నాడు. రోహిత్, కోహ్లీలు పాతతరం ఆటగాళ్లని.. టెస్టుల్లో ఎలా ఆడాలనే టెక్నిక్​ను వీళ్ల నుంచి యంగ్​స్టర్స్ నేర్చుకోవాలన్నాడు మంజ్రేకర్. ఒకవేళ రోహిత్ తన కెరీర్​ను మరింత కాలం పొడిగించుకుందామని భావిస్తే అది అతడి నిర్ణయమన్నాడు. ఇక, త్వరలో ఆఫ్ఘానిస్థాన్​తో మూడు టీ20ల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్​తో 5 టెస్టుల సిరీస్​లో పాల్గొంటుంది. జనవరి 25న హైదరాబాద్​లో జరిగే ఫస్ట్ టెస్ట్​తో ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. మరి.. కోహ్లీ, పంత్​ను ఉద్దేశించి మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: సంచలన నిర్ణయం తీసుకున్న SRH స్టార్ ప్లేయర్.. ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి