iDreamPost

క్రికెట్ లవర్స్​కు గుడ్ న్యూస్.. టీ20 ప్రపంచ కప్​ స్ట్రీమింగ్ పూర్తిగా ఉచితం!

  • Published Mar 05, 2024 | 2:40 PMUpdated Mar 05, 2024 | 2:40 PM

క్రికెట్ ప్రేమికులకు ఓ శుభవార్త. టీ20 వరల్డ్ కప్​ను ఉచితంగా చూసే అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

క్రికెట్ ప్రేమికులకు ఓ శుభవార్త. టీ20 వరల్డ్ కప్​ను ఉచితంగా చూసే అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 05, 2024 | 2:40 PMUpdated Mar 05, 2024 | 2:40 PM
క్రికెట్ లవర్స్​కు గుడ్ న్యూస్.. టీ20 ప్రపంచ కప్​ స్ట్రీమింగ్ పూర్తిగా ఉచితం!

గతేడాది వన్డే వరల్డ్ కప్ క్రికెట్ అభిమానులకు మస్తు వినోదాన్ని పంచింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్​తో ఆ టోర్నమెంట్ ప్రేక్షకులను మునివేళ్ల మీద నిల్చోబెట్టింది. వన్డేల పనైపోయిందని అంతా అనుకుంటున్న టైమ్​లో ప్రపంచ కప్​కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఆ టోర్నీ ముగిసి కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టి అప్పుడే రెండు నెలలు పూర్తయింది. వరుసగా టోర్నమెంట్లు, ఐపీఎల్​ కూడా ఉండటంతో ఈ ఏడాది ఫ్యాన్స్​కు పండగే పండగ. అయితే టీ20 ప్రపంచ కప్​-2024లో రూపంలో ఇంకోసారి ఆడియెన్స్​ను వినోదాన్ని పంచేందుకు ఐసీసీ ప్లాన్ చేస్తోంది. జూన్ నెల మొత్తం మెగా టోర్నీ సందడే ఉండనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్​కు ఓ గుడ్​న్యూస్. పొట్టి కప్ మ్యాచుల్ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేయొచ్చు. ​

క్రికెట్ ఫ్యాన్స్​కు డిస్నీ హాట్​స్టార్ సంస్థ గుడ్​న్యూస్ చెప్పింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్ని మొబైల్​లో ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది హాట్​స్టార్. మెగా టోర్నీలో మ్యాచుల్ని ఎలాంటి ఫీజు చెల్లించుకుండా ఉచితంగా చూడొచ్చు. ఈ వార్తపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీగా మ్యాచులు చూసే అవకాశం కల్పించడం మంచి విషయమని మెచ్చుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం జియో ఉచితంగా మ్యాచులు ఇస్తోంది కాబట్టి దాని బాటలోనే హాట్​స్టార్ నడుస్తోందని అంటున్నారు. కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి ఫ్రీగా స్ట్రీమింగ్ చేయక తప్పడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, యూఎస్, వెస్టిండీస్ సంయుక్తంగా పొట్టి ప్రపంచ కప్​ను ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మెగా టోర్నీలో ఏకంగా 20 దేశాలు పాల్గొంటున్నాయి. 20 టీమ్స్​ను కలిపి నాలుగు గ్రూపులుగా విభజించారు. ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. రోహిత్ సేన తమ లీగ్​ మ్యాచులన్నీ అమెరికాలో ఆడనుంది. టీమిండియా మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. గ్రూప్​-ఏలో ఇండియాతో పాటు దాయాది పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్​ఏ కూడా ఉన్నాయి. జూన్ 5వ తేదీన ఐర్లాండ్​తో తొలి మ్యాచ్ ఆడనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్ స్థానికంగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జూన్ 9న పాక్​తో, జూన్ 12న ఆతిథ్య అమెరికాతో తలపడనుంది. మరి.. టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనుండటంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఆ కోచ్‌ చేసింది తప్పు! యువ క్రికెటర్‌కు దినేష్‌ కార్తీక్‌ మద్దతు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి