iDreamPost

రోలెక్స్ తో లోకేష్ కనగరాజ్ మీటింగ్.. డేట్ ఫిక్స్ చేసిన డిల్లీ!

  • Author ajaykrishna Published - 07:54 PM, Sat - 28 October 23

ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్ తో ఇప్పుడు ఏ హీరో కలిసి కనిపించినా.. వారి కాంబినేషన్ పై అనేక రూమర్స్ పుట్టుకొచ్చేస్తుంటాయి. ఇప్పుడు డిల్లీ అలియాస్ కార్తీ.. రోలెక్స్ - లోకేష్ ల మీటింగ్ కి రంగం సిద్ధం చేశాడు.

ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్ తో ఇప్పుడు ఏ హీరో కలిసి కనిపించినా.. వారి కాంబినేషన్ పై అనేక రూమర్స్ పుట్టుకొచ్చేస్తుంటాయి. ఇప్పుడు డిల్లీ అలియాస్ కార్తీ.. రోలెక్స్ - లోకేష్ ల మీటింగ్ కి రంగం సిద్ధం చేశాడు.

  • Author ajaykrishna Published - 07:54 PM, Sat - 28 October 23
రోలెక్స్ తో లోకేష్ కనగరాజ్ మీటింగ్.. డేట్ ఫిక్స్ చేసిన డిల్లీ!

ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒకే స్టేజ్ పై ఒక స్టార్ ని చూస్తేనే ఫ్యాన్స్ లో పట్టలేని ఆనందం కనిపిస్తుంది. అదే స్టేజ్ పై మల్టీస్టార్స్ కనిపిస్తే.. అందులోనూ ఆ స్టార్స్ కి బిగ్గెస్ట్ బ్రేక్ అందించిన డైరెక్టర్ కూడా దర్శనమిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలాంటి కిక్కే ఇప్పుడు ఫ్యాన్స్ కి అందించేందుకు రెడీ అవుతోంది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటిదాకా తీసింది ఐదు సినిమాలే అయినా అసలు ఆడియన్స్ లో ఊహించని ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్.. ఇప్పుడు ఆ యూనివర్స్ ని ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ లతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నాడు.

ఇక లోకేష్ తో ఇప్పుడు ఏ హీరో కలిసి కనిపించినా.. వారి కాంబినేషన్ పై అనేక రూమర్స్ పుట్టుకొచ్చేస్తుంటాయి. ఎందుకంటే.. లోకేష్ క్రేజ్ అలా ఉంది. అతను ఎవరితో సినిమా అనౌన్స్ చేస్తే.. ఆ స్టార్ పేరు, ఆ సినిమా ఖచ్చితంగా రిలీజ్ వరకు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇటీవల లోకేష్ లియో సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. దళపతి విజయ్ హీరోగా నటించిన ఆ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతోంది. కాగా.. ఇప్పుడు LCU మొదలవ్వడానికి ప్రధాన కారణమైన డిల్లీ అలియాస్ హీరో కార్తీ.. రోలెక్స్ – లోకేష్ ల మీటింగ్ కి రంగం సిద్ధం చేసేశాడు. అదికూడా ఎక్కడో కాదు.. చెన్నైలోని తన సినిమా ఈవెంట్ లోనే.

అవును.. ప్రస్తుతం కార్తీ హీరోగా జపాన్ అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. నవంబర్ లో రిలీజ్ కాబోతుంది. అయితే.. అక్టోబర్ 28న జపాన్ మూవీ ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు మేకర్స్. చెన్నైలో సాయంత్రం వేళలో జరగనున్న ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథులుగా హీరో సూర్య, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హాజరు అవుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఒక రకంగా డిల్లీనే దగ్గరుండి రోలెక్స్ – లోకిలను పబ్లిక్ లో మీట్ అయ్యేలా ప్లాన్ చేశాడని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు లియో తర్వాత లోకేష్.. ఖైదీ 2 చేయనున్నట్లు అనౌన్స్ చేసేశాడు. సో.. జపాన్ ఆడియో లాంచ్ లో ఖైదీ 2, రోలెక్స్ మూవీస్ పై సర్ప్రైజింగ్ అప్డేట్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి లోకేష్ – సూర్య ఏం ప్లాన్ చేశారో తెలియాల్సి ఉంది. ఈ ముగ్గురి కాంబోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి