iDreamPost

VIDEO: స్టార్ హీరోయిన్​కు యాక్సిడెంట్.. కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డారు!

  • Author singhj Published - 03:20 PM, Wed - 4 October 23
  • Author singhj Published - 03:20 PM, Wed - 4 October 23
VIDEO: స్టార్ హీరోయిన్​కు యాక్సిడెంట్.. కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డారు!

ఇటలీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ హీరోయిన్ గాయత్రీ జోషితో పాటు ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వికాస్ ఆఫీస్ సిబ్బంది తెలిపారు. గాయత్రి, వికాస్​లు కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తోంది. ఇదే యాక్సిడెంట్​లో మరో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వెకేషన్ కోసం గాయత్రి తన భర్త వికాస్​తో కలసి ఇటలీలోని సార్డీనియాకు వెళ్లారు. అదే సమయంలో అక్కడ జరుగుతున్న లగ్జరీ కార్ల పరేడ్​లో వీళ్లు కూడా పాల్గొన్నారు.

లగ్జరీ కార్ల పరేడ్​లో భాగంగా టెయిలెడా నుంచి ఓల్బీయాకు వెళ్తున్న క్రమంలో గాయత్రి, ఆమె భర్త వికాస్ ప్రయాణిస్తున్న లంబోర్గిని కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఫెరారీ కారును, వ్యాన్​ను ఢీకొట్టింది. దీంతో ఫెరారీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ కారులో ఉన్న స్విట్జర్లాండ్​కు చెందిన మెలీసా, మార్కస్ జంట మరణించారు. ఈ ప్రమాదంలో గాయత్రి, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ యాక్సిడెంట్​కు సంబంధించిన దృశ్యాలు వెనుక వస్తున్న మరో కారు డాష్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్​గా మారాయి.

ఈ యాక్సిడెంట్​పై నటి గాయత్రి స్పందించారు. దేవుడి దయ వల్ల తాను, వికాస్ స్వల్ప గాయాలతో క్షేమంగా బయటడ్డామని వెల్లడించారు. కాగా, గాయత్రి జోషి నటి అనే విషయం తెలిసిందే. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ చిత్రం ‘స్వదేశ్​’లో ఆమె హీరోయిన్​గా యాక్ట్ చేశారు. 2004లో విడుదలైన ఈ మూవీకి అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అద్భుతమైన యాక్టింగ్​కు గానూ గాయత్రి ఆడియెన్స్​తో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని ఆమె డిసైడ్ అయ్యారు. 2005లో వికాస్ ఒబెరాయ్​ను పెళ్లాడారు. అనంతరం ఛానెల్ వీ ఇండియాలో వీడియో జాకీగా వర్క్ చేశారు. ఆ తర్వాత మోడలింగ్ వైపునకు వెళ్లారు.

ఇదీ చదవండి: ‘లియో’కి బజ్ పెంచుతున్నారా? పోగొడుతున్నారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి