iDreamPost
android-app
ios-app

అతను వీధుల్లోకి వచ్చేస్తాడు! హార్ధిక్‌ పాండ్యా భార్య నటాషా షాకింగ్‌ పోస్ట్‌

  • Published May 26, 2024 | 4:42 PMUpdated May 26, 2024 | 4:42 PM

Hardik Pandya, Natasa: హార్దిక్‌ పాండ్యా భార్య నటాషా చేసిన ఒక పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. ఆ పోస్ట్‌ ఏంటి? ఆమె ఎందుకు చేసింది? ఎవర్ని ఉద్దేశించి చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Hardik Pandya, Natasa: హార్దిక్‌ పాండ్యా భార్య నటాషా చేసిన ఒక పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. ఆ పోస్ట్‌ ఏంటి? ఆమె ఎందుకు చేసింది? ఎవర్ని ఉద్దేశించి చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 26, 2024 | 4:42 PMUpdated May 26, 2024 | 4:42 PM
అతను వీధుల్లోకి వచ్చేస్తాడు! హార్ధిక్‌ పాండ్యా భార్య నటాషా షాకింగ్‌ పోస్ట్‌

హార్ధిక్‌ పాండ్యా-నటాషా దంపతుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్టు ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు విడాకులకు సిద్ధమైనట్లు.. అందులో భాగంగా హార్ధిక్‌ పాండ్యా తన ఆస్థిలోని 70 శాతం వాటాను నటాషాకు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా నటాషా పెట్టిన ఓ పోస్ట్‌ పెను సంచలనంగా మారింది. ‘ఎవరో వీధుల్లోకి రాబోతున్నారు’ అంటూ ఆమె పోస్ట్‌ చేసింది. ఇన్‌డైరెక్ట్‌గా హార్ధిక్‌ పాండ్యా గురించి ఆమె ఈ పోస్ట్‌ చేసి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ఆస్తి ట్రాన్స్‌ఫర్‌ విషయంలో ఇద్దరి మధ్య కొత్త విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. తనకు రావాల్సిన వాటాను తనకు ఇవ్వకుంటే.. పాండ్యాను వీధుల్లో నెలబెట్టి.. బజారుకీడుస్తా అనే ఉద్దేశంతోనే నటాషా ఈ పోస్ట్‌ పెట్టి ఉండొచ్చని సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తోంది.

విడాకుల పుకార్లు వస్తున్న క్రమంలో.. హార్ధిక్‌ పాండ్యా తన ఆస్తిలో 70 శాతం వాటాను నటాషా పేరిట మార్చినట్లు వార్తలు వస్తున్నా.. అందులో నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే.. హార్ధిక్‌ పాండ్యా కొన్న ఆస్థులన్ని తన తల్లి పేరిటే కొన్నాడంటా.. ఇప్పటికీ అవి ఆమె పేరిటే ఉన్నాయి. సో.. పాండ్యా తన వద్ద ఉన్న తక్కువ ఆస్థుల్లోనే 70 శాతం వాటా ఇచ్చేందుకు అంగీకరించినట్లు.. ఆస్థుల అమ్మ పేరిట పెట్టి.. తనకు చాలా తక్కువ ఇస్తున్నాడని భావించిన నటాషా.. ఇదే విషయమై.. పాండ్యాను వీధుల్లోకి తీసుకొస్తానని ఆమె హెచ్చరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై హార్ధిక్‌ పాండ్యా అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. డబ్బు కోసం పాండ్యా పరువుపోయేలా ఉందని అంటున్నారు.

కాగా పాండ్యాతో విడాకులు రూమర్స్‌ వినిపిస్తున్న సమయంలోనే నటాషా తాజాగా ఓ వ్యక్తితో కలిసి బయటికి వచ్చింది. తన ఫ్రెండ్‌ అయిన అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో కలిసి కనిపించింది. అతనితో కలిసి భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్‌కు వచ్చింది. ఇదే టైమ్‌లో నటాషాను.. విడాకుల విషయంపై మీడియా వాళ్లు ప్రశ్నించగా.. నటాషా సమాధానం చెప్పకుండా.. వారి ప్రశ్నను ఖండించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌తో.. పాండ్యా-నటాషా మధ్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరు విడాకులు తీసుకోవడం కూడా పక్కా అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి