iDreamPost
android-app
ios-app

ప్రజలపై రెచ్చిపోయిన సీఎం కుమారుడు.. డబ్బు పిచ్చి పట్టిందంటూ..

ప్రజలపై రెచ్చిపోయిన సీఎం కుమారుడు.. డబ్బు పిచ్చి పట్టిందంటూ..

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కుమారుడు ప్రజలపై సంచలన కామెంట్లు చేశారు. ప్రజలకు డబ్బు పిచ్చి పట్టిదంటూ రెచ్చిపోయారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలపై ఈ కామెంట్లు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య కుమారుడు యతింద్ర సిద్ద రామయ్య తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తండ్రి విజయం గురించి, ప్రజల ప్రవర్తన గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘ కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి చాలా కష్టపడింది. అందరిలాగా మా నాన్నకూడా ఓటర్లకు కుక్కర్లు, ఇస్త్రీపెట్టెలు, గడియారాలు పంచాడు. కానీ ఓటర్లు వస్తువులు వద్దు డబ్బులే కావాలని అడిగారు. ప్రజలకి డబ్బుపిచ్చి చాలా పట్టింది.. ఇచ్చింది తీసుకోరు’’ అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు యతింద్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ముఖ్యమంత్రి కుమారుడు ఈ విధంగా ప్రజలపై వ్యాఖ్యలు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alhilarionbethilarionbetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş