iDreamPost

అయ్యర్​ను విమర్శించొద్దు.. శార్దూల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Mar 11, 2024 | 8:52 PMUpdated Mar 11, 2024 | 9:02 PM

బీసీసీఐ ఆగ్రహానికి గురైన స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​పై ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దయచేసి అతడ్ని విమర్శించొద్దని కోరాడు.

బీసీసీఐ ఆగ్రహానికి గురైన స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​పై ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దయచేసి అతడ్ని విమర్శించొద్దని కోరాడు.

  • Published Mar 11, 2024 | 8:52 PMUpdated Mar 11, 2024 | 9:02 PM
అయ్యర్​ను విమర్శించొద్దు.. శార్దూల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ బోర్డు ఆగ్రహానికి గురైన ఈ టాలెంటెడ్ ప్లేయర్.. తన కాంట్రాక్ట్​ను కోల్పోయాడు. నేషనల్ డ్యూటీకి దూరంగా ఉన్న సమయంలో వెళ్లి డొమెస్టిక్ క్రికెట్​లో ఆడాలని బీసీసీఐ సూచించినా అతడు వినలేదు. గాయం సాకు చూపి రంజీల్లో ఆడకుండా ఎన్​సీఏకు వెళ్లిపోయాడు అయ్యర్. దీంతో అతడి కాంట్రాక్ట్​ను రద్దు చేసింది బోర్డు. అయ్యర్​తో పాటు డొమెస్టిక్​లో ఆడాలనే తమ మాటల్ని బేఖాతరు చేసిన ఇషాన్ కిషన్​ కాంట్రాక్ట్​ను కూడా తొలగించింది. రంజీల్లో ఆడమంటే పట్టించుకోకుండా ఐపీఎల్​కు ప్రిపేర్ అవడమే ఇషాన్ చేసిన తప్పు. ఈ వివాదంలో వీళ్లిద్దరికీ కొందరు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు బోర్డు చేసిందే కరెక్ట్ అన్నారు. అయితే భారత పేస్ ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ మాత్రం అయ్యర్​కు అండగా నిలిచాడు.

శ్రేయస్ అయ్యర్​ను ఎవరూ విమర్శించొద్దని శార్దూల్ ఠాకూర్ కోరాడు. అయితే ఇది బోర్డు కాంట్రాక్ట్ గురించి కాదు.. బ్యాటింగ్ ఫెయిల్యూర్​ విషయంలో అతడికి అండగా నిలిచాడు శార్దూల్. రంజీ ట్రోఫీ-2024 ఫైనల్​లో అయ్యర్ విఫలమయ్యాడు. విదర్భతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన అయ్యర్.. 7 పరుగులకే పెవిలియన్​కు చేరుకున్నాడు. సీనియర్ బ్యాటర్, ముంబై కెప్టెన్ అజింక్యా రహానె కూడా 7 పరుగులే చేసి ఔటయ్యాడు. దీంతో వీళ్లపై విమర్శలు మొదలయ్యాయి. ఇంత అనుభవం ఉన్న ప్లేయర్లు అయి ఉండి, ఫైనల్ మ్యాచ్​లో ఫెయిల్ అవడం ఏంటంటూ అభిమానులు సీరియస్ అయ్యారు. దీంతో ఈ విషయంపై శార్దూల్ రియాక్ట్ అయ్యాడు. దయచేసి అయ్యర్, రహానేను విమర్శించొద్దని కోరాడు. ఇది వాళ్లకు కష్టమైన సమయమని.. అండగా నిలవాలని ఫ్యాన్స్​ను రిక్వెస్ట్ చేశాడు.

రహానె ఈ సీజన్​లో పెద్దగా పరుగులు చేయలేదు. అతడు ఫామ్​లో లేడు. అతడి బ్యాట్ నుంచి ఆశించినంతగా పరుగులు రావడం లేదు. అయితే అతడ్ని నిందించడం కరెక్ట్ కాదు. రహానేతో పాటు అయ్యర్​కు ఇది క్లిష్టమైన సమయం. వాళ్లిద్దరూ ముంబైతో పాటు టీమిండియాకు ఎన్నో మ్యాచుల్లో విజయాలు అందించారు. వాళ్లు మ్యాచ్ విన్నర్స్. ఇప్పుడు వాళ్ల టైమ్ బాగోలేదు. కాబట్టి అయ్యర్, రహానేను విమర్శించే బదులు సపోర్ట్ చేయాలి. క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ. కానీ అండగా నిలవడం కష్టం. ఇప్పుడు అదే పని చేయాలి’ అని శార్దూల్ చెప్పుకొచ్చాడు. కాగా, రంజీ ఫైనల్​లో మొదటి ఇన్నింగ్స్​లో శార్దూల్ అదరగొట్టాడు. 154 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమ్​ను ఆదుకున్నాడు. 75 రన్స్ చేసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. మరి.. అయ్యర్, రహానేను విమర్శించొద్దు అంటూ శార్దూల్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి