iDreamPost

చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌.. పుకార్లకు చెక్‌ పెట్టిన శంకర్‌!

చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌.. పుకార్లకు చెక్‌ పెట్టిన శంకర్‌!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌- తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు సగానిపైగా పూర్తి అయింది. షూటింగ్‌ శరావేగంగా సాగుతున్న వేళ ఉపాసన ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రామ్‌ చరణ్‌ షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శంకర్‌ కూడా గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌లోకి వెళ్లిపోయారు.

రోజులు గడుస్తున్నా శంకర్‌ గేమ్‌ ఛేంజర్‌ గురించి ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వకపోవటం పలు అనుమానాలకు తెరతీసింది. శంకర్‌ గేమ్‌ ఛేంజర్‌ సినిమానుంచి తప్పుకున్నారన్న ప్రచారం మొదలైంది. అంతేకాదు! ఆయన స్థానంలో ‘హిట్‌’ సినిమా దర్శకుడు శైలేష్‌ కొలనును రంగంలోకి దింపినట్లు కూడా వార్తలు రాసాగాయి. సినిమాలోని కొన్ని యాక్షన్‌ సీన్లను శైలేష్‌తో తీయించాలన్న ఉద్దేశ్యంతో నిర్మాత దిల్‌ రాజు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్‌ వచ్చింది.

అయితే, ఈ పుకార్లకు దర్శకుడు శంకర్‌ చెక్‌ పెట్టారు. ఒక్క పోస్టుతో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ యాక్షన్‌ సీక్వెన్స్‌ల చిత్రీకరణలోకి దిగిపోయాను. మళ్లీ రంగంలోకి దిగాను.. నిజంగా’’ అని పేర్కొన్నారు. గేమ్‌ ఛేంజర్‌ అన్న హ్యాస్‌ ట్యాగును కూడా జత చేశారు. ఈ పోస్టుతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. శంకర్‌ మళ్లీ సినిమాలో భాగం కాబోతున్నందుకు సంతోషిస్తున్నారు. మరి, దర్శకుడు శంకర్‌ ఒక్క పోస్టుతో అన్ని పుకార్లకు చెక్‌ పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి