iDreamPost

బ్రేకింగ్: స్కూల్ బస్సు బోల్తా విద్యార్థులకు తీవ్ర గాయాలు!

  • Published Oct 09, 2023 | 10:20 AMUpdated Oct 09, 2023 | 10:34 AM
  • Published Oct 09, 2023 | 10:20 AMUpdated Oct 09, 2023 | 10:34 AM
బ్రేకింగ్: స్కూల్ బస్సు బోల్తా విద్యార్థులకు తీవ్ర గాయాలు!

ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అనుభవం లేకున్నా డ్రైవింగ్ చేయడం, అతి వేగం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వందల మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. తాజాగా స్కూల్ బస్సు బోల్తా పడటంతో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మహబూబ్ నగర్ మౌంట్ బాసిల్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని చిన్నారులను ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు ప్రస్తుతం ఎలాంటి ప్రాణ హాని లేదని వైద్యులు తెలిపారు. కాగా, కాలం చెల్లిన బస్సులు, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి