iDreamPost

సంజూ శాంసన్ ఎమోషనల్ పోస్ట్.. పాపం ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు!

  • Author Soma Sekhar Published - 08:16 AM, Wed - 4 October 23
  • Author Soma Sekhar Published - 08:16 AM, Wed - 4 October 23
సంజూ శాంసన్ ఎమోషనల్ పోస్ట్.. పాపం ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు!

వరల్డ్ కప్ ఆడాలని, ఆడి కప్ గెలవాలని ప్రతీ ఒక్క క్రికెటర్ కల. ఇక తమ లక్ష్యం కోసం కఠోరంగా శ్రమిస్తుంటారు సదరు ఆటగాళ్లు. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ ప్లేయర్లు కన్న కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. వరల్డ్ కప్ జట్టులో స్థానం లభించకపోవడంతో.. తీవ్ర మానసిక వేదనకు గురవుతుంటారు ప్లేయర్లు. తాజాగా టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ పరిస్థితి ఇలాగే ఉంది. అక్టోబర్ 3న ఇండియా-నెదర్లాండ్స్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైంది. ఇక ఈ మ్యాచ్ కు ముందు కేరళలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలోనే సంజూ శాంసన్ ఓ ఎమోషనల్ పోస్ట్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

వరల్డ్ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 3 మంగళవారం ఇండియా-నెదర్లాండ్స్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ మ్యాచ్ కు కేరళలోని గ్రీన్ ఫీల్డ్ మైదానం వేదికగా కాగా.. ఇది సంజూ శాంసన్ స్వస్థలం అన్న సంగతి తెలిసిందే. అయితే నెదర్లాండ్స్ తో ప్రాక్టీస్ మ్యాచ్ కోసం గ్రౌండ్ లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. ఇక్కడే ఆసక్తికర విషయం ఉంది. టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసే గ్రౌండ్ లో సంజూ శాంసన్ భారీ పోస్టర్ ఉంది.

ఈ క్రమంలోనే శాంసన్ ఓ ఎమోషనల్ పోస్ట్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను జతచేస్తూ..”ఈ దైవ భూమిలో.. భారత జట్టుతో ఇలా” అంటూ ఎమోషనల్ కొటేషన్ రాసుకొచ్చాడు. దీనికి జతగా విక్టరీ సింబల్ ను జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో.. శాంసన్ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. సంజూ భాయ్ మీరు టీమ్ లో ఉంటే ఎంతో బాగుండేది, ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. శాంసన్ గత కొంతకాలంగా విఫలమవుతూ వస్తున్నాడు. దీంతో బీసీసీఐ అతడిని పరిగణంలోకి తీసుకోలేదు. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు చోటు కల్పించింది.

 

View this post on Instagram

 

A post shared by Sanju V Samson (@imsanjusamson)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి