iDreamPost

విద్యార్థులకు శుభవార్త చెప్పిన RTC

విద్యార్థులకు శుభవార్త చెప్పిన RTC

విద్యార్థులకు రోడ్డు రవాణా సంస్థ తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో తిరుగుతున్న బస్సులకు అదనంగా మరి కొన్ని బస్సులను తిప్పనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాలేజీ, స్కూల్ కు వెళ్లే విద్యార్థుల ఇబ్బందులు తీరినట్లేనని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంతకు ఇది ఏ రాష్ట్రంలో? అదనంగా వచ్చే బస్సులు ఎన్నంటే?

తెలంగాణలో విద్యా సంస్థలు తిరిగి తెరుచుకున్న విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు స్కూల్, కాలేజీలకు వెళ్లడానికి బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశం TSRTC దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన అధికారులు.. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 500 బస్సులను నడపనున్నట్లు హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. త్వరలో ఆయా రూట్లలో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి