iDreamPost

Rohit Sharma: పచ్చిబూతులతో రెచ్చిపోయిన రోహిత్‌ శర్మ! స్టంప్‌మైక్‌లో రికార్డ్‌..

  • Published Feb 03, 2024 | 4:49 PMUpdated Feb 03, 2024 | 5:16 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌ 396 పరుగుల భారీ స్కోర్‌ చేసిన భారత్‌.. ఇంగ్లండ్‌ను 253 పరుగులకే ఆలౌట్‌ చేసి పైచేయి సాధించింది. అయితే.. మ్యాచ్‌ మధ్యలో రోహిత్‌ శర్మ పచ్చిబూతలతో రెచ్చిపోయాడు. రోహిత్‌ ఎందుకు బూతులు తిట్టాడో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌ 396 పరుగుల భారీ స్కోర్‌ చేసిన భారత్‌.. ఇంగ్లండ్‌ను 253 పరుగులకే ఆలౌట్‌ చేసి పైచేయి సాధించింది. అయితే.. మ్యాచ్‌ మధ్యలో రోహిత్‌ శర్మ పచ్చిబూతలతో రెచ్చిపోయాడు. రోహిత్‌ ఎందుకు బూతులు తిట్టాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 03, 2024 | 4:49 PMUpdated Feb 03, 2024 | 5:16 PM
Rohit Sharma: పచ్చిబూతులతో రెచ్చిపోయిన రోహిత్‌ శర్మ! స్టంప్‌మైక్‌లో రికార్డ్‌..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పైచేయి సాధిస్తోంది. యశస్వి జైస్వాల్‌ అద్భుత పోరాటంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌కు టీమిండియా స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రా చుక్కలు చూపించాడు. తొలి మ్యాచ్‌ ఓటమి బాధనంత ఇంగ్లండ్‌ బ్యాటర్లపై తీర్చుకుంటున్నట్లు కనిపించాడు. తొలి మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఇండియా ఓటమికి కారణమైన ఓలీ పోప్‌ను బుమ్రా చాలా దారుణంగా అవుట్‌ చేశాడు. కిల్లింగ్‌ యార్కర్‌ వేస్తే.. పోప్‌ వద్ద దానికి బదులే లేకుండా పోయింది. దాంతో వికెట్లు కుప్పకూలాయి. ఆ బాల్‌ చూసి.. క్రికెట్‌ అభిమానులే కాదు, టీమిండియా క్రికెటర్లు కూడా షాక్‌ అయ్యారు.

ఒకవైపు బుమ్రా వికెట్లతో చెలరేగుతుంటే.. ఫీల్డింగ్‌లో ఏ మాత్రం తేడా రాకుండా చూసుకోవడానికి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పచ్చిబూతులతో రెచ్చిపోయాడు. రోహిత్‌ మాట్లాడిన బూతులు స్టంప్‌ మైక్‌లో రికార్డ్‌ అయ్యాయి. అయితే.. రోహిత్‌ మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. గ్రౌండ్‌లో క్రికెటర్లు ఇలా మాట్లాడాతా అంటూ నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అయితే.. గ్రౌండ్‌లో ఫీల్డర్లంతా చాలా అలర్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతోనే రోహిత్‌ అలా మాట్లాడాడని, అందులో వాళ్లను నిజంగా తిట్టినట్లు కాదని కొంతమంది క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. హిందీలో.. ‘భెంచోద్‌.. గార్డెన్‌మె ఘూమ్‌ రహే హో.. మా చోద్దుంగా సబ్‌కీ’ అంటూ పచ్చిబూతులు మాట్లాడాడు. ప్రస్తుతం రోహిత్‌ బూతులు మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే. మిగతా బ్యాటర్లంతా విఫలమైనా.. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 209 పరుగులతో రెచ్చిపోయాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌ను బుమ్రా వణికించాడు. జో రూట్‌, బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్‌, ఓలీ పోప్‌ ఇలా టాప్‌ క్లాస్‌ బ్యాటర్లను అవుట్‌ చేసి.. ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. జాక్‌ క్రాలే 76 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. బెన్‌ స్టోక్స్‌ మాత్రం 47 పరుగులతో పర్వాలేదనిపించాడు. కానీ.. బుమ్రా ఇచ్చిన స్ట్రోక్‌కు.. బెన్‌ స్టోక్స్‌ బ్యాట్‌ వదిలేశాడు. రెండు చేతులు పైకెత్తి ఎలా ఆడాలంటూ తన నిస్సాయతను వెల్లడించాడు. మొత్తం మీద బుమ్రా 6 వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్‌ 253 పరుగులకే ఆలౌట్‌ అయింది. కుల్దీప్‌ 3 వికెట్లతో రాణించాడు. మరి ఈ మ్యాచ్‌లో బుమ్రా ప్రదర్శనతో పాటు రోహిత్‌ శర్మ పచ్చిబూతులు తిట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి