iDreamPost

T20 వరల్డ్ కప్ లో ఓపెనర్స్ గా రోహిత్-కోహ్లీ! ఈ మాస్టర్ ప్లాన్ కి రీజన్ వేరే ఉంది!

  • Published Apr 17, 2024 | 6:35 PMUpdated Apr 17, 2024 | 7:00 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్​కు ఇది క్రేజీ న్యూస్. టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ వేస్తున్న మాస్టర్ స్కెచ్ గురించి తెలిస్తే భారత జట్టు అభిమానులంతా ఎగిరి గంతేయాల్సిందే.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్​కు ఇది క్రేజీ న్యూస్. టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ వేస్తున్న మాస్టర్ స్కెచ్ గురించి తెలిస్తే భారత జట్టు అభిమానులంతా ఎగిరి గంతేయాల్సిందే.

  • Published Apr 17, 2024 | 6:35 PMUpdated Apr 17, 2024 | 7:00 PM
T20 వరల్డ్ కప్ లో ఓపెనర్స్ గా రోహిత్-కోహ్లీ! ఈ మాస్టర్ ప్లాన్ కి రీజన్ వేరే ఉంది!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రస్తుత క్రికెట్​లో వీళ్లను మించిన ప్లేయర్స్ లేరు. ఇద్దరూ ఇద్దరే. ఒకరు ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్లను డిఫెన్స్​లో పెడితే.. మరొకరు ఆఖరు వరకు నిలబడి యాంకర్ ఇన్నింగ్స్​తో అదరగొట్టే రకం. ఆటతీరు వేర్వేరు కావొచ్చు గానీ మ్యాచ్​ను మలుపు తిప్పడంలోనూ, టీమ్​ను గెలిపించడంలోనూ ఇద్దరిదీ అందెవేసిన చేయి. కలసికట్టుగా ఆడి ఎన్నో మ్యాచుల్లో టీమిండియాను గెలిపించారు రోకో జోడీ. వీళ్లిద్దరూ క్రీజులో ఉంటే అపోజిషన్ బౌలర్ల పని ఫినిష్. రోహిత్ బాదుడును, కోహ్లీ స్ట్రయిక్ రొటేషన్​ను తట్టుకోలేక ఎంతటి బౌలర్ అయినా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవాల్సిందే. అలాంటి ఈ జోడీ విషయంలో భారత క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

ఐపీఎల్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్-2024 ప్రారంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లకు సంబంధించిన పలు వివరాలను ప్రకటించాల్సి ఉంది. టీమ్ స్క్వాడ్స్​ కూడా ఫైనలైజ్ కావాలి. మరికొన్ని రోజుల్లో ప్రతి దేశం తమ ప్రపంచ కప్ టీమ్​ను ప్రకటించాల్సి ఉంటుంది. భారత సెలక్టర్లు కూడా ఈ విషయంపై సీరియస్​గా పని చేస్తున్నారు. బ్యాటింగ్ యూనిట్, ఆల్​రౌండర్లు, పేసర్లు, స్పిన్నర్లు.. ఇలా దాదాపుగా అన్ని విభాగాల ఎంపికపై బోర్డు ఓ అవగాహనకు వచ్చిందట. అయితే ఈసారి రోహిత్-కోహ్లీ జోడీతో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైందట. టీ20 వరల్డ్ కప్​లో ఈ పాపులర్ ప్లేయర్స్​ను ఓపెనర్లుగా బరిలోకి దింపాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

Crazy news for Rohit-Kohli fans!

వరల్డ్ కప్​లో రోహిత్-కోహ్లీని ఓపెనర్లుగా దింపాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ విషయాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలసి హిట్​మ్యాన్​తో డిస్కస్ కూడా చేశారట. దీనికి రోహిత్ కూడా ఓకే చెప్పాడని వినిపిస్తోంది. టీమిండియాకు అతడు ఎలాగూ ఓపెనర్​గానే ఉన్నాడు. కెప్టెన్​కు జంటగా మరో ఓపెనర్​గా విరాట్​ను పంపాలని ఫిక్స్ అయ్యారని టాక్ నడుస్తోంది. ఆల్రెడీ ఐపీఎల్​లో కోహ్లీ ఆర్సీబీ తరఫున అదే పొజిషన్​లో ఆడుతున్నాడు. ఓపెనర్​గా వచ్చి సెంచరీ కూడా బాదిన కింగ్.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్​గా ఉన్నాడు. కాబట్టి అతడితో వరల్డ్ కప్​లోనూ ఓపెనింగ్ చేయించాలని బోర్డు పెద్దలు డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్‌ అవుతున్నారు. బీసీసీఐ ఆలోచన సూపర్బ్ అని.. రోకో జంటను ఆపడం ఎవరి వల్లా కాదని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రోహిత్-కోహ్లీని ఓపెనర్లుగా చూడాలని మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి