iDreamPost

‘గేమ్ ఛేంజర్’ విషయంలో దిల్ రాజు షాకింగ్ నిర్ణయం? సీన్​లోకి శైలేష్ కొలను!

  • Author singhj Published - 08:39 PM, Tue - 11 July 23
  • Author singhj Published - 08:39 PM, Tue - 11 July 23
‘గేమ్ ఛేంజర్’ విషయంలో దిల్ రాజు షాకింగ్ నిర్ణయం? సీన్​లోకి శైలేష్ కొలను!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు సినిమాకు తన ఇమేజ్​ను పెంచుకుంటూ పోతున్నారు. మూస ధోరణి చిత్రాలకు దూరంగా ఉంటూ.. కథ, కథనాలకు ఆయన ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ మూవీస్ ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రెండు సినిమాల్లో చరణ్ వైవిధ్యమైన నటనతో అందర్నీ మెస్మరైజ్ చేశారు. డ్యాన్సులు, ఫైట్లు అద్భుతంగా చేస్తారనే పేరున్న చరణ్​.. పై రెండు చిత్రాల్లో యాక్టింగ్​లోనూ తన మార్క్ చూపించారు. ‘రంగస్థలం’లో చెవిటివాడిగా నటించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో భిన్నమైన ఎమోషన్స్ కలిగిన రామ్ పాత్రను ఆయన పోషించిన తీరు అద్భుతం అనే చెప్పాలి.

‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్​ పాపులారిటీ​ పాన్ ఇండియా లెవల్లో పెరిగింది. ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు రావడం విశేషం. ఈ మూవీని యూఎస్​, జపాన్ ఆడియెన్స్​ బాగా ఆదరించడంతో చరణ్ గ్లోబల్ స్టార్​గా ఎదిగారు. అలాంటి చెర్రీ నుంచి తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ శంకర్​తో ‘గేమ్ ఛేంజర్’ అనే మూవీని చరణ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంది. అయితే ‘గేమ్ ఛేంజర్​’తో పాటు ఏకకాలంలో ‘భారతీయుడు 2’ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు శంకర్. ఈ టైమ్​లో లైకా ప్రొడక్షన్స్ కొత్త మెలిక పెట్టిందట.

‘భారతీయుడు’ సీక్వెల్​ను పూర్తి చేయనిదే శంకర్ ఏ సినిమానూ పూర్తి చేయడానికి వీల్లేదంటూ లైకా ప్రొడక్షన్స్ ఆంక్షలు విధించిందట. దీంతో చేసేదేమీ లేక కమల్ హాసన్ మూవీ షూటింగ్ పనుల్లో శంకర్ బిజీ అయిపోయారట. మరోవైపు చెర్రీ కూడా తన వ్యక్తిగత కారణాల వల్ల షూటింగ్​కు గ్యాప్ ఇస్తూ వస్తున్నారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్​’ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రిలీజ్ టైమ్​కు సినిమా పూర్తయ్యేలా కనిపించడం లేదట. దీంతో చిత్ర నిర్మాత దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ‘హిట్’ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలనును దిల్ రాజు సీన్​లోకి దించారని సమాచారం. ఈ ఫిల్మ్​లోని కొన్ని యాక్షన్ సీక్వెన్సులను శైలేష్ కొలనుతో షూట్ చేయించాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారని టాలీవుడ్ టాక్. దీంట్లో ఎంత నిజం ఉందనేది మూవీ యూనిట్​కే తెలియాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి