iDreamPost

ఫ్యాన్స్‌ దెబ్బకు ప్రాజెక్ట్‌ కే ఫస్ట్‌ లుక్‌ మారిపోయిందిగా..!

ఫ్యాన్స్‌ దెబ్బకు ప్రాజెక్ట్‌ కే ఫస్ట్‌ లుక్‌ మారిపోయిందిగా..!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- హిట్టు సినిమాల దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో ‘ప్రాజెక్ట్‌ కే’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్‌ కే ప్యాన్‌ వరల్డ్‌ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక, ఈ సినిమాకు సంబంధించి బుధవారం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. అయితే, ఈ పోస్టర్‌ హాలీవుడ్‌ సినిమా ‘ఐరన్‌ మ్యాన్‌’ను లుక్‌ను పోలి ఉండటంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. సోషల్‌ మీడియా వ్యాప్తంగా దారుణంగా కామెంట్లు పెట్టడం స్టార్ట్‌ చేశారు.

ఫస్ట్‌ లుక్‌లో ప్రభాస్‌ ముఖం సరిగ్గా కనిపించటం లేదంటూ.. ఆ బాడీకి తల తగిలించినట్లుగా ఉందంటూ మండిపడుతున్నారు. తమ హీరో సినిమా కెరీర్‌ను నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ దెబ్బకు సినిమా టీం భయపడిపోయింది. సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్న ట్రోలింగ్స్‌కు తలొగ్గింది. నిన్న విడుదల అయిన ఫస్ట్‌ లుక్‌ను డిలీట్‌ చేసింది. కొత్త ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.

ఈ పోస్టర్‌లో కొంత మార్పులను చేసింది. బ్యాక్‌ గ్రౌండ్‌, ప్రభాస్‌ ముఖం క్లారిటీగా ‍కనిపించేలా చూసుకుంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కొంత శాంతించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ప్రాజెక్ట్‌ కే సినిమా దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకునే నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌తో పాటు దేశ దిగ్గజ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. మరి, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దెబ్బకు ప్రాజెక్ట్‌ కే సినిమా టీం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మార్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి