iDreamPost

థియేటర్స్ ఓటీటీలోకి కాకుండా డైరెక్ట్ గా టీవీలోనే రిలీజ్

  • Published Mar 15, 2024 | 1:47 PMUpdated Mar 15, 2024 | 1:47 PM

తమిళ్ ఇండస్ట్రీలోని ఓ సినిమా థియేటర్స్ లో, ఓటీటీలో రిలీజ్ కాకుండానే ఏకంగా టీవీలో రిలీజ్ చేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

తమిళ్ ఇండస్ట్రీలోని ఓ సినిమా థియేటర్స్ లో, ఓటీటీలో రిలీజ్ కాకుండానే ఏకంగా టీవీలో రిలీజ్ చేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

  • Published Mar 15, 2024 | 1:47 PMUpdated Mar 15, 2024 | 1:47 PM
థియేటర్స్ ఓటీటీలోకి కాకుండా డైరెక్ట్ గా టీవీలోనే రిలీజ్

ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి.. సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు నెల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయడం చూస్తుంటాం. అలాగే మరికొన్ని సినిమాలైతే నేరుగా ఓటీటీతోనే ఒప్పందం కుదుర్చుకొని అక్కడ రిలీజ్ చేస్తుంటారు. అయితే ఎక్కడైనా థియేటర్లలో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఏకంగా టీవీలోకి వేయడం అంటూ ఎన్నడూ జరగదు. కానీ, తాజాగా ఓ తమిళ్ సినిమా విషయంలో మాత్రం అచ్చం ఇలానే జరిగిది. ఇంత వరకు ఇండస్ట్రీలో ఎన్నడూ లేని విధంగా ఓ సినిమా డైరెక్ట్ గా టీవీలో ప్రసారం కావడం పై అంతా షాక్ కు గురయ్యారు. అసలు ఈ సినిమా టీవీలో రిలీజ్ చేస్తున్నట్లు కనీసం చితృ బృందానికి కూడా తెలియజేయకపోవడంతో అందులోని ఓ నటుడు దీనిపై స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యాలు చేశాడు. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

థియేటర్లలో రిలీజ్ కావాల్సిన సినిమా నేరుగా టీవీలోకి వస్తే ఎలా ఉంటుంది? ఈ విషయం కనీసం ఆ మూవీలో నటించిన నటీనటులకు కానీ, చిత్ర బృందానికి కానీ తెలియకపోవడం చాలా గమన్హారం. ప్రస్తుతం తమిళ సినిమా ‘పొన్ ఒండ్రు కండెన్’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఇందులో కోలీవుడ్ హీరో ఆశోక్ సెల్వన్, వసంత్ రవి, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించారు. కాగా, ఈ చిత్రానికి ప్రియా కామాక్షి దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. కానీ, ఇంతలోనే అందరికీ షాకిస్తూ పొన్ ఒండ్రు కండెన్ సినిమా నేరుగా టీవీలో విడుదల చేయనున్నట్లు ప్రకటన వెలువడిది. ఇక దీనిని చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ఈ సినిమాను కలర్స్ తమిళ్ అనే ఛానెల్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంటూ ఓ ప్రోమో కూడా వదిలింది.

ఇక ఇది చూసిన నటుడు వసంత్ రవి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. అందులో అతడు ‘షాకింగ్ గా ఉంది. అసలు ఇది నిజమేనా? జియో స్టూడియోస్ లాంటి ప్రముఖ సంస్థ ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. కనీసం సినిమాలో నటించిన వారికి గానీ, డైరెక్టర్ గానీ.. ఈ సినిమాతో సంబంధమున్న ఏ ఒక్కరికీ కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా టీవీలో రిలీజ్ చేస్తుండటం చాలా బాధాగా ఉంది. ఈ సినిమా కోసం మేము ఎంతో కష్టపడ్డాం. కానీ, ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఇలా నేరుగా టీవీలోకి వస్తుందంటే మా మనసు ముక్కలవుతోంది. అసలు పొన్ ఒండ్రు కండేన్ సినిమా టీమ్ ఎవ్వరికీ ఈ విషయం తెలియజేయకపోవడం నిజంగా చాలా బాధకరం. ఇలా సోషల్ మీడియా ద్వారా అందరితోపాటు మాకు టెలివిజన్ ప్రీమియర్ గురించి ఇంత గొప్పగా, మర్యాదగా తెలియజేసినందుకు జియో స్టూడియోస్ కు కృతజ్ఙతలు తెలియజేస్తున్నాను. నిజానికి సినిమా కమర్షియల్ అంశాలకు సంబంధించిన విషయాల్లో ఆర్టిస్టులకు ఎటువంటి అధికారం ఉండదు. కానీ, అందుకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా తెలుసుకునే హక్కు మాకుంది’ అని రాసుకొచ్చాడు. దీంతో వెంటనే జియో స్టూడియో సదరు పోస్ట్ ను తొలగించినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ పొన్ ఒండ్రు కండెన్ సినిమా చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. కాగా, ఎన్నో అడ్డంకులు రావడంతో రిలీజ్ అవ్వడంలో వాయిదా పడుతూ వస్తోంది. అయితే చివరికి ఈ సినిమాను ఇలా నేరుగా టీవీలో రిలీజ్ చేస్తారని మాత్రం మూవీలోని యాక్టర్స్ కూడా ఊహించలేదు.మరి, పొన్ ఒండ్రు కండెన్ సినిమా చిత్ర బృందంకు తెలియకుండా టీవీలో రిలీజ్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి