iDreamPost

కత్తితో భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య! ఎందుకో తెలుసా?

ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ క్షణికావేశంలో భర్త మర్మాంగాన్ని కోసేసింది. ఇదే ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.

ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ క్షణికావేశంలో భర్త మర్మాంగాన్ని కోసేసింది. ఇదే ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.

కత్తితో భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య! ఎందుకో తెలుసా?

భార్యాభర్తలు అన్నక తిట్టుకోవడం, కొట్టుకోవడం అనేది కామన్. కానీ, ఇంత దానికే కొందరు దంపతుల ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. మాట్లాడుకుంటే సమిసిపోయే గొడవలను.. చివరికి గొడ్డలి దాక తెచ్చుకుంటున్నారు. అచ్చం ఇలాగే రెచ్చిపోయిన ఓ మహిళ.. ఇటీవల ఎవరూ ఊహించని కిరాతకానికి పాల్పడింది. భర్తపై కోపంతో ఊగిపోయి ఇంట్లో ఉన్న కత్తితో అతని మర్మాంగాన్ని కోసేసింది. దీంతో రక్తపు మడుగులో పడి అతడు కొట్టుమిట్టాడాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా అంగుల్ జిల్లాలోని కందసర్ గ్రామంలో పరమానంద ముదులి (45)-సుకాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలం నుంచి భార్య సుకాంతి మరోక వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందని భర్త తరుచు అనుమానించేవాడు. అయితే, ఇదే విషయమై ఈ దంపతులు చాలా కాలం నుంచి గొడవలు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం కూడా ఈ భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు.

కోపంతో ఊగిపోయి ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన భార్య సుకాంతి.. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న కత్తితో భర్త మర్మాంగాన్ని కోసేసింది. దీంతో రక్తపు మడుగులో పడి పరమానంద ముదులి కొట్టుమిట్టాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, అతడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మిషమంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలోనే నిందితురాలిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి