iDreamPost
android-app
ios-app

ఆళ్ల ఇంట విషాదం

  • Published Sep 03, 2020 | 5:25 PM Updated Updated Sep 03, 2020 | 5:25 PM
ఆళ్ల ఇంట విషాదం

మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ల రామకృష్ణా రెడ్ది ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి ఆళ్ళ దశరధరామి రెడ్డి అనారోగ్యంతో ఈ సాయంత్రం మృతి చెందారు. 87 ఏళ్ళ దశరధరామి రెడ్డి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేడు ఆయన ఆరోగ్య ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

దశరధరామిరెడ్డికి ఇద్దరు కుమారులు.పెద్ద కుమారుడు “రాంకీ” గ్రూప్ చైర్మన్ మరియు రాజ్యసభ సభ్యుడైన ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి.రెండవ కొడుకు మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి.

ఆళ్ల దశరధరామిరెడ్డి గతంలో పెదకాకాని గ్రామ సర్పంచ్ గా సేవలు అందించారు. కాంగ్రెసులో ఉన్న ఆళ్ళ కుటుంబం జగన్ వైసీపీ స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరి జగన్ కు అండగా నిలిచారు.

2014 మరియు 2019 ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వైసీపీ తరుపున మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి ప్రత్యర్థి నారా లోకేష్. 2014 ఎన్నికల్లో అయోధ్య రామి రెడ్డి నర్సరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటి చేసి ఓడిపోయారు.

ఆళ్ళ దశరధరామి రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.