iDreamPost
android-app
ios-app

పేదలకు నగదు బదిలీ జరగాల్సిందే, జగన్ విధానానికి ఆర్థిక నిపుణుల మద్దతు

  • Published Jun 02, 2021 | 4:48 AM Updated Updated Jun 02, 2021 | 4:48 AM
పేదలకు నగదు బదిలీ జరగాల్సిందే, జగన్ విధానానికి ఆర్థిక నిపుణుల మద్దతు

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అప్పులు గురించి ఆలోవహించకుండా పేదలకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం జరగాలని మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అన్నారు. అంతకుముందు అనేక మంది ప్రముఖు ఆర్థిక వేత్తలు కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు.

తాజాగా అజీజ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ అమిత్ బసోల్ కూడా అదే చెబుతున్నారు. కరోనా వంటి మహావిపత్తు కాలంలో ప్రజలకు విరివిగా నగదు బదిలీ జరగాల్సిందేనని భావిస్తున్నారు. ఆర్థికవ్యవస్థలో పంపింగ్ చేయాల్సిందేనని అంటున్నారు. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి మెరుగుపడడం, ఆర్థికవ్యవస్థను నిలబెట్టుకోవడం సాధ్యపడుతుందని అంచనా వేస్తున్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే జగన్ విధానాలను విమర్శిస్తున్న వారికి కనువిప్పుగా ఈ ప్రకటనలన్నీ ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వం నగదుబదిలీ ద్వారా వివిధ పథకాల కింద పేదలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తోంది. దాని ఫలితంగా ఆర్థికరంగానికి ఎంతో మేలు జరుగుతుందని ఆర్థిక వేత్తలు చెబుతుండగా, జగన్ తీరు టీడీపీ వంటి నేతలకు మింగుడుపడకపోవడం గమనార్హం.

దేశంలో కరోనా మొదటి వేవ్న కన్నా సెకండ్ వేవ్ ఆర్థికరంగంపై ఎక్కువ ప్రభావం చూపుతోందని ప్రొఫెసర్ అమిత్ బసోల్ చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఉపాధి కోల్పోయి, కొనుగోలుశక్తి పడిపోయిన వర్గాలకు నగదుబదిలీ ద్వారా ఉపశమనం కల్పించాలని సూచిస్తున్నారు. అది పేదలకు భరోసాగా నిలవడమే కాకుండా, ఆర్థికరంగం పునరుత్తేజానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. కుదేలవుతున్న సమయంలో నగదు ని మార్కెట్ కి తరలించడం ద్వారా నిలబెట్టుకునే ప్రయత్నం ఆర్థిక వ్యవస్థకు తోడ్పటుని అందిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద ఏకంగా రూ. 1.25 లక్షల కుటుంబాలకు పంపిణీ చేస్తోంది. నెలనెలా ఫించన్లు, అమ్మ ఒడి, రైతు భరోసా వంటి పథకాలతో ప్రతీ కుటుంబానికి సగటున రూ. 30వేల వరకూ ప్రయోజనం దక్కుతోంది. దాంతో ఆయా కుటుంబాలకు ఊరటతో పాటు తిరిగి ఆ నగదు మార్కెట్లోకి రావడంతో ఆర్థిక నిపుణులు చెబుతున్నట్టుగా మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది.

గత ఏడాది కూడా ఏపీలో ఒక్క మహానగరం లేకపోయినప్పటికీ ప్రభుత్వ పన్నుల ఆదాయం పూర్తిగా పడిపోకుండా నిలబడేందుకు ఈ ప్రయత్నం దోహదం చేసినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీలో ఆకలిచావులు, ఇతర తీవ్ర సమస్యలకు ఇప్పటి వరకూ ఆస్కారం లేకుండా పోయింది. ఏమయినా జగన్ విధానం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు చెబుతున్న తీరులో ఉండడం గమనార్హం. అదే సమయంలో విపక్షాలు ఈ తీరుని తప్పుబడుతూ అప్పుల గురించి హైలెట్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే పనిలో ఉన్నారని అమిత్ బసోల్ వంటి వారి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.