Idream media
Idream media
విజేతలే చరిత్ర రాస్తారు, నిర్మిస్తారు, నిర్ణయిస్తారు. పరాజితులది గత చరిత్ర. ఒక మనిషికున్నట్టే , ఒక పార్టీకి కూడా టైం ఉంటుంది. అది అయిపోతుంది. తెలుగుదేశం పార్టీకి కూడా Expiry Date వచ్చింది. ఇది చంద్రబాబుకి తెలియడం లేదు. అది ఆయన అజ్ఞానం, భ్రాంతి. 60 దాటితే రిటైర్మెంట్ ఉన్నప్పుడు, 70 దాటినా పార్టీ నడపాలనుకోవడం అమాయకత్వం. పార్టీ కష్టార్జితం కాదు, లాక్కున్నది. కష్టార్జితాన్ని కాపాడుకోవడమే కష్టం. లాక్కున్న దాన్ని ఇంత కాలం అనుభవించడమే గొప్ప. ఇంకా తాను, తన కొడుకు ఆ పేరు మీద బతకాలనుకోవడం అత్యాశ.
1978-83లో కాంగ్రెస్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రజలకి ఒక ప్రత్యామ్నాయం కావాల్సి వచ్చింది. NTR కన్పించాడు. జనం గెలిపించారు. ఓడిపోయిన చంద్రబాబు మామ పంచనే చేరాడు. 1984లో నాదెండ్ల తిరుగుబాటు కలిసొచ్చింది. క్యాంప్ రాజకీయాల్లో ఆరితేరిన బాబు చక్రం తిప్పాడు. దానికి తోడు ఈనాడు బలం, ప్రజల్లో ఇంకా NTRపైన అభిమానం కలిసొచ్చాయి. అల్లుడు పనికొచ్చాడని NTR అనుకున్నాడు గానీ, ఇదే ఫార్ములాతో తన పని పడతాడని ఊహించలేకపోయాడు.
Also Read:బాబుకు సిఐడి నోటీసుపై సోము ఎందుకు స్పందించలేదు..?
నాయకుడు కాకపోయినా, ప్రజల మద్దతు లేకపోయినా బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. జన్మభూమి, ఇంకుడు గుంతలు జన జీవితాన్ని మార్చే అద్భుతాలుగా చెలామణి అయ్యాయి. సంపద కొందరి సొంతమే అయ్యింది. రాజశేఖరరెడ్డి వచ్చిన తర్వాతే ప్రజల కోసం చిత్తశుద్ధితో పథకాలు మొదలయ్యాయి.
రాష్ట్రం విడిపోయింది. కారణాలు ఏమైతేనేం బాబు మళ్లీ గెలిచాడు. పదేళ్లు అధికారానికి దూరమయ్యానని అనుకున్నాడు గానీ, ప్రజలకు దూరమయ్యానని అనుకోలేదు. కార్పొరేట్ స్కూల్ యజమానులని, లిక్కర్ వ్యాపారులని, రియల్ ఎస్టేట్ దిగ్గజాలను చేరదీసి వ్యాపారానికి తెర లేపాడు. అమరావతి అని అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కాలం గడిపేశాడు. ముఖ్యమంత్రి అంటే R&B లో క్లర్క్ కాదు. ఎంతసేపూ భవనాలు కడుతున్నానని ప్రచారం చేసుకున్నాడు గానీ, పేదవాడి సంగతి పట్టించుకోలేదు. ఫలితంగా ఓడిపోయాడు చిత్తుచిత్తుగా.
Also Read:తమిళనాడులో “యువ”,”రంగం” తరహా సరికొత్త రాజకీయం
జగన్ వాగ్దానాలు చేసి గెలిచాడనుకున్నాడే తప్ప తాను ఎందుకు ఓడిపోయాడో బాబుకు అర్థం కాలేదు. ఆత్మవిమర్శ చేసుకునే లక్షణమే లేదు. ఉంటే NTRకి పొడిచేవాడు కాదు. జగన్ 4 ఏళ్లు జనం మధ్యే ఉండి గెలిచిన విషయం బాబుకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ జనం మెచ్చిన నాయకుడు కాదు, రాజకీయాలు చేసే వ్యక్తి మాత్రమే.
జగన్ వచ్చిన తర్వాత , ఆయన్ని బలహీనపరచడానికి రకరకాల కార్డ్స్ వాడాడు. మతం రంగు పులిమారు. హిందువులకి అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెట్టాడు. అప్పులు, అక్రమాలు, అవినీతి అన్నాడు. సిగ్గు, రోషం ఉందా? అని అడిగాడు. ఇంకోసారి చిత్తుచిత్తుగా ఓడిపోయాడు.
Also Read:వందేళ్ళ రెడ్క్రాస్
జగన్ మీద ఏదో వ్యతిరేకత ఏర్పడిపోయింది, తనకి ఓట్లు పడతాయని ఆశించాడు. తన గురించి బాబు ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. SV.యూనివర్సిటీలో MA ఎకనామిక్స్ చదివాను అంటూ ఉంటాడు. బాబు ఏం చదివాడో, ఏం నేర్చుకున్నాడో ఆ తిరుమల వెంకటేశ్వరుడికే తెలియాలి. ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం. రెండెకరాల నుంచి ఎంత సంపాదించాడో తనకే తెలియని బాబుకి డబ్బు లెక్కలు తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యం.
ద్రవ్య చెలామణి అనేది సింపుల్ సూత్రం. నా దగ్గర 500 రూపాయలు ఉంటే అది నెల రోజుల్లో వెయ్యి మంది చేతులు మారితే దాని విలువ రూ.5 లక్షలు. అంటే రూ.5 లక్షల సరుకుల్ని ఒక్క 500 నోటు కొనుగోలు చేస్తుంది.నా 500 నోటుతో నేను ఒక కుర్చీ కొన్నాననుకుంటే, ఆ ఫర్నిచర్ షాపు వాడు ఆ నోటుతో కిరాణా సామాన్లు కొంటాడు. అతను మెడికల్ షాపులో మందులు కొంటాడు. ఆ షాప్ వాడు ఇంకేదో కొంటాడు. ఒక్క 500 నోటునే వెయ్యి మంది మారిస్తే ట్రక్కు నిండా సామాన్లు వస్తాయి. అందరి అవసరాలు తీరుతాయి. ఇదే నోటుని నేను బీరువాలో 10 ఏళ్లు దాచి పెడితే అది Dead Stock. కోట్ల రూపాయల సరుకుల మార్పిడిని లేకుండా చేసి సమాజానికి హాని చేసిన వాన్ని అవుతాను. సంపద సృష్టించానని భ్రమ పడిన బాబు , దాన్ని బడా బాబుల చేతిలో పెడితే అది బ్లాక్ మనీగా మారిపోయింది. పేదవాళ్ల వరకూ రానివ్వలేదు.
Also Read:ఎవరీ గురుమూర్తి.. ? తిరుపతి వైసీపీ టిక్కెట్ ఎలా దక్కింది..?
జగన్ దీన్ని తిరగరాశారు. కొన్ని వేల కోట్ల సంపదని జనంలోకి Pump చేశాడు. ద్రవ్య చెలామణి పెరిగింది. ఎందుకంటే పథకాలు అందుకుంటున్నది పేదవాళ్లు. డబ్బు దాచుకోరు. అవసరానికి ఖర్చు పెట్టుకుంటారు. మహిళలు, కార్మికుల బడ్జెట్ మారింది. అవసరాలు తీరాయి. జీవనంలో నాణ్యత పెరిగింది. ఎకనమిక్స్ చదివితే ఇది అర్థం కాదు. జనం బాధల్ని చదివితే ఇది అర్థమవుతుంది.
అన్ని వర్గాల వాళ్లు సంక్షేమ పథకాలు అందుకుని ప్రశాంతంగా ఉంటే, ఈ చిన్న లాజిక్ మరిచిపోయి ఓట్లు వేస్తారని ఎట్లా అనుకున్నావ్ బాబూ, మీకే కాదు, పార్టీకి కూడా వయసై పోయింది. గోద్రేజ్ వాళ్లతో మాట్లాడి ఓ పెద్ద తాళం కప్పని కొనుక్కుని పార్టీ ఆఫీస్కు వేసేయండి. ఇక రాష్ట్రంలో ప్రతిపక్షమంటారా? జగన్ ఏమరుపాటుగా ఉంటే దానంతటదే పుడుతుంది. అది ఆయన చూసుకుంటాడు, మీ పని కాదు.
కాలం చెల్లిపోయిన మందుల్నే మనం వాడం. ఇక పార్టీనేం భరిస్తాం. అందుకే డస్ట్బిన్లో ప్రజలు వేసేశారు.