iDreamPost
android-app
ios-app

ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురి దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురి దుర్మరణం

కర్ణాటక రహదారుల నెత్తురోడాయి. శుక్రవారం రాత్రి సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతుచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని బెళగావి జిల్లా, రామదుర్గం తాలుకా చించనూరు గ్రామానికి చెందిన 15 మంది కూలీలు ధార్వాడ జిల్లా మోరబ గ్రామంలో కూలీ పనులకు వెళ్లారు. పని ముగించుకుని టాటా ఏస్ వాహనంలో తిరిగి వస్తుండగా సవదత్తి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ధార్వాడ రోడ్డులో బొలెరో వాహనం టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాద తీవ్రతకు టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న కూలీలలో ఐదుగురు మహిళలు అక్కడిక్కడే మృతిచెందారు. మరణించినవారిలో ఒక చిన్నారి కూడా ఉంది. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. దుర్ఘటన గురించి తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.