ఢిల్లీలో నానాటికీ వాయుకాలుష్యం పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ అవి ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వటంలేదు. స్వచ్చమైన గాలి కోసం ప్రజలకు ఎదురుచూపులు తప్పటంలేదు. దీన్ని అదనుగా భావించిన ఢిల్లీలో సాకేత్ ప్రాంతంలోని ‘ఆక్సిప్యూర్’ అనే బార్ స్వచ్చమైన గాలిని అమ్మకానికి ఉంచింది. వాతావరణం నుండి గాలిని గ్రహించి అందులో ఉన్న నైట్రోజన్ మరియు ఇతర వాయువులను వేరు చేయడం ద్వారా 95% శుద్ధ ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తారు. ప్రజలు అక్కడికి వెళ్లి ముక్కుకు అమర్చే గొట్టాల ద్వారా శుద్ధ ఆక్సిజన్ ని పీల్చవచ్చు.
పదిహేను నిమిషాల ఆక్సిజన్ను రూ. 299లకు అమ్ముతున్నట్లు బార్ నిర్వాహకులు తెలిపారు. లెమన్గ్రాస్, ఆరెంజ్, సిన్నామన్ (దాల్చినచెక్క), స్పియర్మింట్ (పుదీనా), పెప్పర్మింట్, యూకలిప్టస్, లావెండర్, వెనీలా, చెర్రీ, బాదం, వింటర్గ్రీన్, గార్డెనియాస్ వంటి ఏడు రకాల పరిమళాలలో ఆక్సిజన్ను అందిస్తున్నారు.