iDreamPost
android-app
ios-app

తండ్రి లాంటి వారు – న్యాయం చేయాలి

తండ్రి లాంటి వారు – న్యాయం చేయాలి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రానికి తండ్రి లాంటి వారని.. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని మోత్కుపల్లి నర్సింహులు కోరారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాల్సింది పోయి.. వారిని ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం గద్దె దిగి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో హై కోర్టు చురకలంటించినా.. కేసీఆర్‌ తీరు మారకపోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్‌ చర్యలను గమనిస్తుందని.. అదును చూసి ఆయన పని పడుతుందని మోత్కుపల్లి హెచ్చరించారు.