iDreamPost
iDreamPost
మహారాష్ట్ర కేసు నిన్న విచారించి ,తీర్పును ఈ రోజుకు వాయిదా వేసిన సుప్రీం కోర్టు ఈ ఉదయం విచారణ మొదలైన 10 నిముషాలలోనే తీర్పు చెప్పింది.
సుప్రీం తీర్పు ప్రకారం రేపు సాయంత్రం 5 గంటల లోపు ఫడణవీస్ ప్రభుత్వం శాసనసభలో బల నిరూపణ చేసుకోవాలి. కొత్తగా ఎన్నికయిన సభ్యులుతో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయించటానికి ప్రొటెం స్పీకర్ ను తక్షణం నియమించాలని గవర్నరుకు సూచించింది. బీజేపీ కోరినట్లు కాకుండా బల పరీక్షరహస్య ఓటింగ్ పద్దతిలో కాకూండా బహిరంగంగా జరగాలని,మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డింగ్ చెయ్యాలని సుప్రీ కోర్ట్ ఆదేశించింది.
ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్ 1985 నుంచి వరుసగా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. బీజేపీ నేత కాళిదాస్ కొలంబకర్ కూడా ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.గవర్నర్ వీరిద్దరిలో ఒకరిని ప్రొటెం స్పీకర్ గా నియమించే అవకాశం ఉంది. కాళిదాస్ కొలంబకర్ మొన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఆయన కాంగ్రెసులో చేరక ముందు శివసేన తరుపున ఎమ్మెల్యేగా గెలిచియున్నాడు.
రేపు బల పరీక్షలో విపక్ష ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ విప్ ను ధిక్కరించినా ప్రోటెం స్పీకర్ వారి మీద చర్యలు తీసుకోలేడు.ప్రోటెం స్పీకరును సభ్యుల మీద చర్యలు తీసుకునే అధికారం లేదు. దీనితో విపక్షం నుంచి అధికార బీజేపీ కి క్రాస్ వోటింగ్ జరిగే అవకాశం ఉంది. నిన్న విపక్ష కూటమి 162 మంది ఎమ్మెల్యేలతో పేరేడ్ నిర్వహించగా,అజిత్ పవర్ తో ముగ్గురు-నలుగురు మించి NCP ఎమ్మెల్యేలు లేకపోవటంతో రేపు జరిగే బల పరీక్ష మీద ఉత్కంఠత నెలకొనింది. బల పరీక్షలో బీజేపీ గెలుస్తుందా?లేక కర్ణాటకలో లాగా ఓడిపోతుందా ?చూడాలి.