iDreamPost
android-app
ios-app

బాబును చూసి భయపడుతున్న ఆ కేసు నిందితుడు

  • Published Dec 11, 2020 | 9:42 AM Updated Updated Dec 11, 2020 | 9:42 AM
బాబును చూసి భయపడుతున్న ఆ కేసు నిందితుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తొలినాళ్లలో తెలంగాణా శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ టిడిపి అభ్యర్థికి మద్దతుగా ఓటు వేసేందుకు రూ. 50లక్షలు లంచం ఎర చూపారు. ఈ సందర్భంగా నాటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. లంచం ఇస్తున్న సందర్భంగా నాటి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కూడా ఫోన్ లో మాట్లాడించారు. వీటికి సంబంధించిన ఆడియో, వీడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఈ సంఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడంతో పాటు, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి హడావుడిగా పెట్టేబేడా సర్దుకుని అమరావతికి తరలివచ్చే పరిస్థితులు కల్పించింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో ఎ4 నిందితుడుగా ఉన్న జరుసలేం మత్తయ్య చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేశారు. ఈ కేసులో తాను అప్రూవర్ గా మారినందుకు తనని చంపేందుకు కుట్ర జరుగుతుందని, చంద్రబాబు , రేవంత్ రెడ్డి వర్గం నుండి తనకు ప్రాణ హాని ఉందని కావున ఈ కేసు పూర్తి అయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని కోరుతు మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించారు. అప్రూవర్ గా మారిన జరుసలేం మత్తయ్య చేసిన వాఖ్యలు పై తెలుగుదేశం నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

jojobet girişmarsbahisJojobet GirişJojobet GirişCasibomcasibom girişholiganbettaraftarium24madridbet girişmadridbet girişmadridbetJojobet Girişkatla