iDreamPost
android-app
ios-app

పబ్జి…. ఇక పొజి

పబ్జి…. ఇక  పొజి

కేంద్ర ప్రభుత్వం బుధవారం తీసుకున్న 118 చైనా యాప్స్ నిషేదం భారతదేశంలో టీనేజీ యువత కలిగిన తల్లిదండ్రులకు నిజంగా ఆనందించదగిన సమాచారమే. గత మూడేళ్లుగా భారతదేశంలోని టీనేజ్ యువతను ఉర్రూతలూగించే వారిని నేర ప్రవృత్తి వైపు నడిపిస్తున్న పబ్జి గేమ్ పిల్లల తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా మారింది. రాత్రివేళ నిద్ర సైతం మానుకొని ఆన్లైన్లో యుద్ధాలు చేస్తూ పెద్ద పెద్ద అరపులతో రాత్రివేళల్లో భయపెట్టే టీనేజ్ యువత పబ్జి పిచ్చి కి ఒక తెర పడినట్లే.

ఇప్పుడే ఎందుకు..

భారత-చైనా సరిహద్దు ఎల్ ఏ సి వద్ద ఉన్న గాల్వాన్ లోయ లో జూన్ లో చైనా సైనికులు భారత సైన్యం పై దాడికి దిగారు. ఈ దాడిలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు.. చైనా వైపు నష్టం జరిగింది. ఈ సమయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం అప్పట్లోనే టిక్ టాక్ సహా 118 కీలకమైన నిషేధించింది. అప్పట్లో తప్పించుకున్న చైనా ఆన్లైన్ గేమ్ పబ్జి మళ్లీ భారత-చైనా సరిహద్దు లో నెలకొన్న ఉద్రిక్తత చిక్కుకొని నిషేధానికి గురైంది.

తల్లిదండ్రులు నుంచి మద్దతు..  

పబ్జి నిషేధించాలని భారతీయ తల్లిదండ్రుల నుంచి విపరీతమైన అభ్యర్థనాలు.. సూచనలు వచ్చాయి.. విద్యార్థులతో ఢిల్లీలో నిర్వహించిన మాన్ కీ బాత్ లో ఓ విద్యార్థి తల్లి తన కొడుకు ఆన్లైన్ గేమింగ్ లో పడి చదవడం లేదని ప్రధానికి ఫిర్యాదు చేయగా….. ప్రధాని మోడీ స్వయంగా మోదీ హే పబ్జి వాలా హే అంటూ… ఆ గేమ్ యొక్క తీవ్రతను అందరికీ అర్థమయ్యేలా చెప్పకనే చెప్పారు.. ఆ ప్రకటన తర్వాత అంత పబ్జి ను కేంద్రం నిషేధిస్తుంది అని భావించారు.. అయితే చైనాతో మనకు ఉన్న సత్సంబంధాలు కొన్ని ఆన్ లైన్ చట్టాల పరిధిలో అప్పట్లో ఆ నిర్ణయం తీసుకోలేదు.. అయితే ప్రతిసారి భారత ప్రధాని కార్యాలయానికి ఆన్లైన్ పబ్జి గేమ్ ను నిషేధించాలని కుప్పలుతెప్పలుగా వివిధ రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయి.. ఇవి సుమారు ఎనిమిది లక్షలు దాటినట్లు ఇటీవల ఓ సహ చట్టం దరఖాస్తు గారు కు సమాచారం అందించారు…

ఏమవుతుంది అంటే ..???

పబ్జి గేమ్ లో ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి సుమారు 45 శాతం మంది భారత దేశ యువత ఉన్నట్లు తెలుస్తోంది.. మరీ ముఖ్యంగా 12 సంవత్సరాల నుంచి 25 ఏళ్లలోపు యువత (మగ పిల్లలు ) పబ్జి ను ఇండియాలో డౌన్లోడ్ చేస్తున్నట్లు భారతదేశ శాస్త్ర సాంకేతిక శాఖ ఓ నివేదికలో పేర్కొంది… పబ్ జి గేమ్ కు అలవాటు పడిన చాలామంది రాత్రివేళ సరిగా నిద్ర పోవడం లేదని కనీసం వారు రోజులో రెండు గంటలు కూడా విశ్రాంతి తీసుకోవడం లేదని ఓ అధ్యయనంలో తెలిసింది.. ఆడే కొద్ది లెవెల్స్ మారుతూ.. మరింత మంది శత్రువులను చంపాలనే కలవరింత లతో పడుకుంటున్న సమయంలో కూడా వారు గేమ్ లోనే ఉంటున్నట్లు సైకాలజిస్టులు సంఘము సైతం భారత ప్రభుత్వానికి నివేదించింది..

ఈ గేమ్ మొత్తం తుపాకులు బాంబులు కత్తులు చంపడం అనే నేరప్రవృత్తి కలిగిన ఆట కావడంతో యువతలో వారి ఆలోచనల్లో కోపం కసి హత్య చేసేముందు విడుదలయ్యే హార్మోన్లు విడుదల అవుతున్న ట్లు గుర్తించారు.. ముఖ్యంగా యుక్త వయసులోనే యువతీ ఈ రోజున ఉండడంతో వారు భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేసేందుకు ఈ గేమ్ దోహదపడుతుందని గుర్తించారు.

ఇక బంద్

పబ్జి గేమ్ ను గూగుల్ ప్లే స్టోర్ ఆపిల్ స్టోర్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.. దీనికి అనుగుణంగా గూగుల్ ఆప్ ఇల్లు భారతదేశంలోని పబ్జి గేమ్ ను పూర్తిగా మాయం చేయనున్నారు.. ప్రస్తుతం అన్ని మొబైల్స్లో పబ్జి గేమ్ ఇన్ స్టాల్ అయినా మాదిరిగా ఒక రెండు మూడు రోజుల్లోనే అది పూర్తిగా ఆగిపోనుఎం దని తెలుస్తోంది… అయితే దీనికి రిలేటెడ్ గా మరికొన్ని గేమ్స్ కూడా ఆన్లైన్లో లభ్యత గా ఉన్నాయి.. పబ్జి క్లోన్ ఆప్స్ కూడా ఉన్నాయి.. మరి వీటి పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetsuperbetinMeritbet güncel girişJojobet GirişcasibomHoliganbetgalabetHoliganbetJojobetHoliganbetJojobetHoliganbetJojobet GirişJojobet Giriş