iDreamPost
android-app
ios-app

వైఎస్ వివేకా హత్య కేసు – డిజిపి స్పష్టత

  • Published Oct 15, 2019 | 6:27 AM Updated Updated Oct 15, 2019 | 6:27 AM
వైఎస్ వివేకా హత్య కేసు – డిజిపి స్పష్టత

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వస్తున్న ఆరోపణలు నిజం కావని, కేసు విచారణ సమర్థవంతంగా సాగుతుందని ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు తాము పట్టించుకోమని, పోలీస్ వాళ్లు తామ పని తాము చేసుకుంటు పోతారని అన్నారు. రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావం తగ్గిందని, ప్రజలు మీద కూడా వీరి ప్రభావం చాలా మేరకు తగ్గిందని తెలిపారు. ప్రజాస్వమ్యం ద్వారా మాత్రమే మార్పు వస్తుందని, హింస ద్వారా ప్రజాస్వామ్యం రాదని పేర్కొన్నారు. మావోయిస్ట్ అరుణ పోలీసుల దగ్గర ఉన్నారనే అసత్య ప్రచారం చేస్తున్నారని, పోలీస్ అదుపులో ఏ మావోయిస్టు లేరని డీజీపీ స్పష్టం చేశారు.