iDreamPost
android-app
ios-app

ఏపీలో 62 మందికి కరోనా నిర్దారణ

ఏపీలో 62 మందికి కరోనా నిర్దారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 62 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,514 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  వెల్లడించింది. కాగా  1731 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 728 గా నమోదయింది. కరోనా కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55 మంది మరణించారు.

గడచిన 24 గంటల్లో 51 మంది కోవిడ్19 నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారని, కర్నూలు జిల్లాలో ఒక్కరు మరణించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 8,415 శాంపిల్స్‌ పరీక్షించగా రాష్ట్రంలో 45 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి.

gamdomCasibommarsbahis girişMarsbahisjojobetjojobet girişJojobet Giriş