iDreamPost
android-app
ios-app

సీఎం జగన్‌ వైజాగ్‌ టూర్‌.. హర్యానా సీఎంతో భేటీ..

సీఎం జగన్‌ వైజాగ్‌ టూర్‌.. హర్యానా సీఎంతో భేటీ..

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ గత కొద్దిరోజులుగా వైజాగ్‌లో ఉంటున్నారు. రిషికొండ సమీపంలోని పెమ వెల్‌నెస్‌ సెంటర్‌లో నేచురోపతి చికిత్స తీసుకుంటున్నారు. రేపటి వరకు మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ విశాఖలోనే ఉండబోతున్నారు.

ఈ నేపథ్యంలో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో భేటీ అయ్యేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈరోజు ఉదయం విశాఖకు వచ్చారు. ఉదయం 11:50 గంటలకు రిషికొండలోని పెమ వెల్‌నెస్‌ సెంటర్‌కు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. అక్కడ హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో సమావేశమయ్యారు. ఇరువురు దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు. ఇరువురు సీఎంలు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

మధ్యాహ్నం 1:25 గంటల వరకు ముఖ్యమంత్రులు ఖట్టర్, వైఎస్‌ జగన్‌ల మధ్య చర్చలు సాగాయి. ఖట్టర్‌తో భేటీ అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ తిరిగి తాడేపల్లి చేరుకున్నారు. హర్యానా సీఎం ఖట్టర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అవడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş