iDreamPost
android-app
ios-app

ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకులు నారాయణ మృతి

ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకులు నారాయణ మృతి

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకులు నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో సీఎం వైయస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనను అర్థంతరంగా ముగించుకొని ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకొని . అక్కడి నుంచి నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లె చేరుకున్నారు.

వైయస్‌ కుటుంబంతో నారాయణకు మూడు దశాబ్దాలకుపైగా అనుబంధం ఉంది. నారాయణ వైఎస్ రాజారెడ్డితో, వైఎస్ రాజశేఖరరెడ్డి తో, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్‌సన్నిహితులుగా ఉన్నారు. జగన్‌ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరి గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో జగన్‌ భేటీ అయ్యేందుకు వెళ్లారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని, అదే విధంగా రాష్ట్ర ఆర్థిక లోటు భర్తీ చేయాలని ప్రధాని మోడీని కోరేందుకు సీఎం జగన్ వెళ్లారు. గురువారం రాత్రి అమిత్ షాతో భేటీ కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈరోజు ఉదయం ప్రధానిని కలిసిన అనంతరం 10 గంటలకు అమిత్ షా ను కలవాలిసి ఉంది. ఇంతలో జగన్ కుటుంబ సన్నిహితుడు వ్యక్తిగత సలహాదారుని మరణ వార్తతో అర్ధాంతరంగా ఢిల్లీ పర్యటనను సీఎం జగన్ ముగించాలిసి వచ్చింది.