iDreamPost
android-app
ios-app

ఆన్ లైన్ నామినేషన్ల లోగుట్టేంటి బాబూ?

ఆన్ లైన్ నామినేషన్ల లోగుట్టేంటి బాబూ?

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపాలని సూచించారు. అంతవరకు ప్రతిపక్ష నేతగా మంచి మాటే.. కానీ ఇంకో డిమాండ్ చేశారు.. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేసి తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని… “ఏం తెలివి బాసూ”..ఫార్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ అనుబవం కదా..రోగి కోరిందే డాక్టరు ఇచ్చినట్లు.. మీరు అడిగితే ఇస్తున్నారో లేక.. ఆయన ఇచ్చేవి మీకు అనుకూలంగా వస్తున్నాయో కాని..ఎస్ ఈసీ నిర్ణయాలు అన్నీ మీకు అనుకూలంగానే తీసుకుంటున్నారు మరి. ఎందుకంటే గ్రామ పంచాయతీనే కాదు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా కరోనా కారణంతో అప్పట్లో వాయిదా వేశారు.. మరి ఇప్పుడు వాటి ఊసెత్తకుండా కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలకే ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు.. లోగుట్టు పెరుమాళ్లకెరుక.. అన్నట్లు ఎందుకో బాబుకు తెలుసు అందుకే ఆ ఊసెత్తడం లేదు.. అదేమీ తెలియదు కాబోలు..బీజేపీ మాత్రం గ్రామ పంచాయితీ ఏన్నికల నోటిఫికేషన్ ను స్వాగతిస్తూ..జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని కోరింది మరి.. ఆ విషయం బాబు మరిచారా? లేకు మరిచినట్లు నటిస్తున్నారా? లేక..ప్రస్తుతం జగన్ సర్కార్ గ్రామాల్లో ఇళ్ల పట్టాలు పంచుతోంది. ఆ కార్యక్రమం పూర్తి అయితే టీడీపీ వైపు చూసే నాధుడు ఉండడంని చంద్రన్న భయమా? పరిశీలకులు మాత్రం మూడోదే నిజం అంటున్నారు. ఎందుకంటే నిమ్మగడ్డ ఏపీ సర్కార్ కు ఓ లేఖరాసారు.. ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి ఏపీలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు నిలిపి వేయాలని.. అంతేకాదు గ్రామాల్లో ఇళ్లపట్టాల పంపీణీ కూడా ఆపెయ్యాలని అధికారులకు తాఖీదు ఇచ్చింది ఎస్ ఈసీ. ఓ వైపు సర్కార్ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఇవాళ సమయం ముగిసిపోవడంతో సోమవారం విచారిస్తామని కోర్టు పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్, ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఇవేవీ పట్టనట్లు నిమ్మగడ్డ మాత్రం నిమ్మళంగా తన ప్రణాళికను అమలు చేసే దిశలో దూకుడుగా దూసుకెళ్తేతున్నారు.

నిమ్మగడ్డ నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉండడంతో..(ఉండడం ఏంటి అలా ఉండేలా స్కెచ్ వేసిందే చంద్రన్న అన్నది వైసీపీ వాదన మరి) చంద్రబాబు గళం విప్పారు.. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని స్థానాలకు మళ్లీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని అన్నారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో గ్రామ వాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించవద్దని విజ్ఞప్తి చేశారు. అంతవరకు బాగానే ఉంది.. కాని ఇంకో మాట సెలవిచ్చారు అదేంటంటే గతంలో జరిగిన అనేక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ లోనూ నామినేషన్లు స్వీకరించాలని అన్నారు.. అవును గతంలో జరిగిన అంటే ఎంటీ ? దౌర్జన్యాలా? లేక కరోనా భయమా? దౌర్జన్యాలు జరుగుతాయనే కదా కేంద్రభలగాల పర్యవేక్షణ అడిగింది.. మరి ఆన్ లైన్ ఎందుకు? నలబై సంవత్సరాల అనుభవం కదా? ఏపీలో కరోనా తగ్గలేదని బాబుకు తెలుసు.. నిమ్మగడ్డకు తెలుసు.. అందుకే ఇదే మాట నిమ్మగడ్డ అంటే కరోనా లేదన్నారకదా అని ప్రభుత్వం నిలదీస్తుంది.. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు డిమాండ్ చేస్తే.. ఇవాళో రేపో ఇతర పక్షాలు డిమాండ్ చేస్తాయి..వాటిని సాకుగా చూపి ఆన్ లైన్ నామినేషన్ విధానం ప్రవేశ పెట్టొచ్చన్నది బాబు మాటల్లోని అంతరార్ధం అంటున్నారు పరిశీలకులు.

ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారుపైనా వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు, సీఎంకు సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎన్నికల సంఘాన్ని నియంత్రించేందుకు సీఎం ఎవరు? ఎన్నికలకు వ్యతిరేకంగా తనవాళ్లతో ప్రకటనలు ఇప్పించడం ఏమిటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ చెప్పుచేతల్లో ఉండే అధికారులకే ఉన్నత పదవులా అని నిలదీశారు. చంద్రబాబు మాటల్లో నిజం ఉంది.. ఎన్నికల సంఘాన్ని నియంత్రించడానికి సీఎం ఎవరు? ఓకే అంగీకరిద్దాం.. కాని గతంలో ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ చెప్పిన మటలు బాబుకు గుర్తులేవా? తిరిగి ఎన్నినిర్వహించినప్పుడు ఎకగ్రీవాలు అలానే ఉంటాయి.. మిగతా చోట్లనే ఎన్నికలు జరుపుతామన్నమాటలు. అదే ప్రకారం స్వయంప్రతిపత్తి కల్గిన నిమ్మగడ్డ నిర్ణయం తీసుకుంటే ..చంద్రబాబు ఎవరు డిమాండ్ చేయడానికి.. చంద్రబాబులాగే ఉద్యోగులు, అధికారులు తమ డిమాండ్లును లేవెనెత్తితే తప్పా? చంద్రబాబు ఏకగ్రీలాను రద్దు చేయమని డిమాండే చేస్తే రైటా? ఇదెక్కడి న్యాయం చంద్రన్నా? నీకు అనుకూలంగా ఉంటే ఓ నీతి..వ్యతిరేకంగా ఉంటే మరో నీతా? వాస్తవానికి అప్పట్లో ఎన్నికలు వాయిదా పడిందే.. వైసీపీ అభ్యర్థులే అధికంగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడమనీ, టీడీపీని గ్రామాల్లో ప్రజలు దేఖడం లేదని కాదంటారా?