Idream media
Idream media
సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన కవయిత్రికి దక్కింది. అమెరికా, కనెక్టికట్లోని యాలే యూనివర్శిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న లూయిస్ గ్లక్ను 2020 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. “నిరాడంబరమైన అందంతో వ్యక్తిగత ఉనికిని విశ్వవ్యాపితం చేసే ఆమె స్పష్టమైన కవితా స్వరానికి” ఈ పురస్కారం దక్కినట్లు స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.
1968లో లూయిస్ గ్లక్ ‘ఫస్ట్ బార్న్’ పేరుతో తొలి కవిత రాశారు.తర్వాత అతికొద్ది కాలంలోనే అమెరికా సాహిత్య రంగంలో ప్రముఖ కవయిత్రిగా గుర్తింపు పొందారు.ఆమె రచనలు ముఖ్యంగా బాల్యం,కుటుంబ సభ్యుల మధ్య ఉండే సన్నిహిత సంబంధాలపై కేంద్రీకృతమై ఉంటాయి.1993లో ఆమె రాసిన ‘ది వైల్డ్’ అనే ఐరిష్ కవితకు పులిట్జర్ పురస్కారం అందుకున్నారు. ఇప్పటివరకు లూయిస్ 12 కవితా సంపుటాలు రచించారు.తన కవితలతో ఎంతో మందిని ప్రభావితం చేసిన లూయిస్ నేషనల్ బుక్ అవార్డు వంటి ఎన్నో పురస్కారాలు పొందారు.
ఇప్పటివరకు సాహిత్య రంగంలో నోబెల్ బహుమతికి 117 ఎంపికయ్యారు. వీరిలో 16 మంది మహిళలు ఉండటం విశేషం.