iDreamPost

మెదక్‌ వాసులు గర్వపడే సినిమా ‘నీతోనే నేను’: సుధాక‌ర్ రెడ్డి

మెదక్‌ వాసులు గర్వపడే సినిమా ‘నీతోనే నేను’: సుధాక‌ర్ రెడ్డి

‘నీతోనే నేను’ సినిమాను చూసిన మెద‌క్ వాళ్లంద‌రూ.. మా ప్రాంత‌వాసి చేసిన సినిమా అని గొప్ప‌గా చెప్పుకుంటారంటూ చిత్ర నిర్మాత ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి అన్నారు. ఈ సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు మంచి సినిమా చూశామని చెబుతారని అన్నారు. బుధవారం ‘నీతోనే నేను’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ మెదక్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. కేవ‌లం 33 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ కంప్లీట్ చేశామన్నారు.

సింగిల్ షెడ్యూల్‌లో ప్లానింగ్ ప్రకారం సినిమా పూర్తి చేసినట్లు తెలిపారు. టీచ‌ర్స్ మీద సినిమా చేస్తున్నారేంటంటూ తనను చాలా మంది అడిగారన్నారు. ‘ నా ఉపాధ్యాయుల మీద‌, నా క‌థ మీద‌, నా టీమ్ మీద‌, నా మీద నాకు ఉన్న న‌మ్మ‌కంతో ముందుకు అడుగులు వేస్తూ వ‌చ్చా’నని తెలిపారు. అనంతరం దర్శకుడు అంజి రామ్‌ మాట్లాడుతూ.. మెదక్‌లో ‘నీతోనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌టం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

సుధాకర్‌రెడ్డి ఇండ‌స్ట్రీలోకి కొత్త‌గా అడుగు పెట్టిన‌ప్ప‌టికీ డేడికేష‌న్, క‌మిట్‌మెంట్‌తో సినిమాను కంప్లీట్ చేశారని తెలిపారు. అంటే మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌వ‌చ్చు క‌దా అనేది వాళ్ల అభిప్రాయం. కాగా, ఈ సినిమాలో ‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు హీరోయిన్లుగా నటించారు. అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వం వహించగా.. ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మాణ బాధ్యతల్ని చేపట్టారు. ఈ సినిమా అక్టోబ‌ర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి