iDreamPost

భారత్​ను ప్రశంసల్లో ముంచెత్తిన PAK మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్​!

  • Author singhj Published - 05:47 PM, Tue - 19 September 23
  • Author singhj Published - 05:47 PM, Tue - 19 September 23
భారత్​ను ప్రశంసల్లో ముంచెత్తిన PAK మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్​!

భారతదేశం అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోంది. స్పోర్ట్స్, ఎంటర్​టైన్​మెంట్, టెక్నాలజీ, సైన్స్.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇండియా తన సత్తా చాటుతోంది. మన దేశం నుంచి ఎందరో విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. అలాగే అక్కడి కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఉద్యోగులుగానే కాదు స్టార్టప్​లు పెట్టి పెద్ద కంపెనీలుగానూ మార్చి వేలాది ఉందికి జాబ్స్ ఇస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ భారత్ గణనీయ వృద్ధి సాధిస్తోంది.

జాబిల్లి మీద రహస్యాలు తెలుసుకునేందుకు గానూ చంద్రయాన్-3ని సక్సెస్​ఫుల్​గా ప్రయోగించిన ఇస్రో.. సూర్యుడి పైకి ఆదిత్య ఎల్-1ను కూడా విజయవంతంగా పంపింది. చంద్రయాన్, సూర్యయాన్ ప్రయోగాల తర్వాత సముద్రంలోని సీక్రెట్స్ తెలుసుకునేందుకు సముద్రయాన్​ ప్రయోగానికి భారత్ సిద్ధమవుతోంది. ఒకవైపు శాస్త్ర, సాంకేతిక, క్రీడా, వినోద, ఆర్థిక రంగాల్లో ఇండియా దూసుకెళ్తుంటే.. మరోవైపు దాయాది పాకిస్థాన్​లో మాత్రం పరిస్థితులు గంగదరగోళంగా ఉన్నాయి.

పాకిస్థాన్​లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్​లో ప్రస్తుత గందరగోళానికి, రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాతో పాటు మాజీ స్పై మాస్టర్ ఫైజ్ హమీద్ కారణమని షరీఫ్ ఆరోపించారు. ఈ సందర్భంగా భారత్​ పైన ఆయన ప్రశంసల జల్లులు కురిపించారు. ఇండియా చంద్రుడి మీదకు చేరుకుందని.. జీ20 మీటింగ్​తో అందర్నీ ఆకట్టుకుందన్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం బిలియన్ డాలర్ల అప్పు కోసం ప్రపంచ దేశాలను అడుక్కుంటోందన్నారు నవాజ్ షరీఫ్​. పాత అప్పులను తీర్చలేని స్థితిలో పాక్ ఉండటం విచారకరమని వాపోయారు.

ఇదీ చదవండి: తెలంగాణలోనూ RTCలో మహిళలకు ఉచిత ప్రయాణం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి