iDreamPost

తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్.. ’ఆయన మా నాన్న లాంటి వ్యక్తి‘

  • Published Apr 11, 2024 | 11:06 AMUpdated Apr 11, 2024 | 11:06 AM

Nandamuri Taraka Ratna: నందమూరి తారకరత్న భార్య ఉగాది సెలబ్రేషన్స్ గురించి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు..

Nandamuri Taraka Ratna: నందమూరి తారకరత్న భార్య ఉగాది సెలబ్రేషన్స్ గురించి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు..

  • Published Apr 11, 2024 | 11:06 AMUpdated Apr 11, 2024 | 11:06 AM
తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్.. ’ఆయన మా నాన్న లాంటి వ్యక్తి‘

టాలీవుడ్ హీరో, నందమూరి తారకరత్న.. 2023లో చనిపోయిన సంగతి తెలిసిందే. లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లిన తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు సుమారు 23 రోజుల పాటు చికిత్స అందించారు. కానీ లాభం లేకుండా పోయింది. చివరకు ఆయన మరణించారు.

ఇక తారకరత్న చనిపోవడం ఆయన భార్యాబిడ్డలకు తీరని లోటని చెప్పవచ్చు. ఇక తారకరత్న భార్యకు వైసీసీ ఎంపీ విజయసాయి రెడ్డితో దగ్గరి బంధుత్వం ఉంది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా తారకరత్న కుటుంబం ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య అలేఖ్యా రెడ్డి తన ముగ్గురు పిల్లలతో కలిసి తెలుగు నూతన సంవత్సర పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు.

ఉగాది పండుగ సందర్భంగా విజయసాయి రెడ్డి స్వయంగా తారకరత్న ఇంటికి వెళ్లారు. తారకరత్న భార్య అలేఖ్య, అతడి పిల్లలతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకున్నారు. ఈ విషయాన్ని అలేఖ్య తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. తనకు తండ్రిలాంటి విజయసాయి రెడ్డి ఆశీర్వాదాలు తమకు ఎప్పుడు ఉంటాయని.. ఎలక్షన్ బిజీలో ఉన్నప్పటికి తమ కోసం ఇంటికి వచ్చారని చెప్పుకొచ్చారు అలేఖ్యారెడ్డి.

అలేఖ్య తన ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చారు. ’’మా జీవితంలో నాన్న లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అంకుల్‌ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉంటాయి. కష్ట, సుఖాలన్నింటిలో ఆయన మాకు ఎప్పుడు తోడుగా ఉన్నారు. మాకు ధైర్యం చెప్పే వారు. ఎలక్షన్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ పండగ రోజున మా కోసం ప్రత్యేకంగా మా ఇంటికి రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది‘‘అన్నారు.

’’ఇలాంటి సమయంలో మాతో గడపడం ఎంత ప్రత్యేకమో.. దాని విలువ ఏంటో ఆయనకే తెలుసు. ఉగాది రోజును మాకు స్పెషల్‌గా మార్చిన విజయ్‌సాయి అంకుల్‌ కి ధన్యవాదాలు. మా పై ఆయన ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది‘‘ అంటూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరలవుతోంది. విజయసాయిరెడ్డి చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి