iDreamPost

Nandamuri Kalyanram: ఎన్నికల్లో ఎటు వైపో.. నేను, తారక్ కలిసి నిర్ణయించుకుంటాం: కళ్యాణ్ రామ్!

  • Published Dec 27, 2023 | 11:42 AMUpdated Dec 27, 2023 | 1:21 PM

డెవిల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..

డెవిల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..

  • Published Dec 27, 2023 | 11:42 AMUpdated Dec 27, 2023 | 1:21 PM
Nandamuri Kalyanram: ఎన్నికల్లో ఎటు వైపో.. నేను, తారక్ కలిసి నిర్ణయించుకుంటాం: కళ్యాణ్ రామ్!

వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ కెరిర్లో ముందుకు సాగుతున్నారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్.  బింబిసార సినిమాతో తన కెరీర్ లోనే సాలిడ్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత నుంచి మరింత జాగ్రత్తగా కథలు ఎంచుకోవడం ప్రారంభించాడు. అయితే ఆయన చివరి చిత్రం అమిగోస్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో తడబడింది. దాంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ క్రమంలో హిట్ కొట్టాలని బలంగా నిర్ణయించుకున్న కళ్యాణ్ రామ్.. డెవిల్ అంటూ ప్రేక్షకులు మందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన బ్రిటిష్ ఏజెంట్ గా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 29న ఇయర్ ఎండ్ లో డెవిల్ థియేటర్లలో విడుదల కానుంది.

మరో రెండు రోజుల్లో డెవిల్ సినిమా రిలీజ్ ఉండండటంతో.. ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమా గురించి ఆసక్తిర అంశాలు వెల్లడిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఏపీ రాజకీయాలపై కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

kalyan ram comments about politics

ఇంటర్వ్యూలో భాగంగా 2024 ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి అని యాంకర్ ప్రశ్నించినప్పుడు.. కళ్యాణ్ రామ్ దీర్ఘంగా కాసేపు అలోచించి.. దీని గురించి ఫ్యామిలీగా తాను, ఎన్టీఆర్ కలసి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. సినిమా వేరు, రాజకీయం వేరు. కాబట్టి ఫ్యామిలీతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం అన్నాడు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే తారక్ కి, నందమూరి ఫ్యామిలీకి కాస్త గ్యాప్ ఉందనే ప్రచారం ఉంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు జూనియర్ స్పందించిన తీరుపై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు కూడా అలానే వైరల్ అవుతున్నాయి.

ఇక ఎన్టీఆర్, తనకు మధ్య ఉండే బాండింగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కళ్యాణ్ రామ్. తారక్, తాను జీవితాంతం అన్నదమ్ములుగానే ఉంటామని.. తమ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరని అన్నారు. ‘డెవిల్’ సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని.. అన్నదమ్ముల మధ్య విబేధాలు రావడం వల్లే ఇలా చేస్తున్నారంటూ రూమర్లు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటని ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ ని ప్రశ్నించాడు యాంకర్. అందుకు ఆయన స్పందిస్తూ.. తామిద్దరం జీవితాంతం అన్నదమ్ములమే అని.. తమ బంధానికి కొలమానం ఒక ట్వీటు, ఒక ఈవెంట్‌కు రావడం అని ఎవరైనా అనుకుంటే మాత్రం.. మొదట ఆ ఆలోచనను మనసులో నుంచి తీసేసుకోవాలని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి