iDreamPost

రంజీ ట్రోఫీ ఫైనల్​లో శార్దూల్ మెరుపు ఇన్నింగ్స్.. 37 బంతుల్లోనే..!

  • Published Mar 10, 2024 | 5:10 PMUpdated Mar 10, 2024 | 5:10 PM

టీమిండియా ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరోమారు తన బ్యాట్ పవర్ చూపించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్​లో మెరుపు ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు.

టీమిండియా ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరోమారు తన బ్యాట్ పవర్ చూపించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్​లో మెరుపు ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు.

  • Published Mar 10, 2024 | 5:10 PMUpdated Mar 10, 2024 | 5:10 PM
రంజీ ట్రోఫీ ఫైనల్​లో శార్దూల్ మెరుపు ఇన్నింగ్స్.. 37 బంతుల్లోనే..!

టీమిండియా ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరోమారో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. మెరుపు ఇన్నింగ్స్​తో ఒక్కసారిగా అందరి చూపులను తన వైపునకు తిప్పుకున్నాడు. రంజీ ట్రోఫీ-2024 ఫైనల్​లో బ్లాస్టింగ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. టాపార్డర్​తో పాటు మిడిలార్డర్ కూడా ఫెయిలైన సమయంలో బ్యాటింగ్ బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు శార్దూల్. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ముంబైని పీకల్లోతు కష్టాల్లో నుంచి గట్టెక్కించి.. గౌరవప్రద స్కోరును అందించాడు. 154 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమ్​ను 200 పరుగులు దాటించాడు. శార్దూల్ గనుక లేకపోతే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.

ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడిన శార్దూల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్​ను అందుకున్నాడు. ఓవరాల్​గా ముంబై ఫస్ట్ ఇన్నింగ్స్​లో 69 బంతులు ఎదుర్కొన్న అతడు.. 8 బౌండరీలు, 3 భారీ సిక్సుల సాయంతో 75 పరుగులు చేసి చివరి వికెట్​గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్​లో 224 రన్స్ చేసింది. ఇందులో శార్దూల్ బ్యాట్ నుంచే 75 పరుగులు వచ్చాయి. ఆ టీమ్ ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్ లవ్లానీ (37) మంచి స్టార్ట్ అందించారు. కానీ హర్ష్​ దూబె (3/62), యష్ ఠాకూర్ (3/54), ఉమేశ్ యాదవ్ (2/43) చెలరేగి బౌలింగ్ చేయడంతో బ్యాటర్లు అంతా పెవిలియన్​కు క్యూ కట్టారు. దీంతో ముంబై 170 పరుగులు చేసినా గొప్పే అని అంతా అనుకున్నారు. అప్పుడే క్రీజులోకి వచ్చాడు శార్దూల్.

తుషార్ దేశ్​పాండే (14) సాయంతో శార్దూల్ ముంబై ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లాడు. స్ట్రయిక్ రొటేషన్ చేస్తూ మధ్యలో బిగ్ షాట్స్ బాదాడు. ఫోర్లు, సిక్సుల ద్వారానే అతడు 50 పరుగులు చేశాడు. అతడు కౌంటర్ అటాక్ చేయకపోయి ఉంటే ముంబై మరింత డిఫెన్స్​లో పడేది. ఇక, రెండో ఇన్నింగ్స్​ స్టార్ట్ చేసిన విదర్భ ప్రస్తుతం 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగులతో ఉంది. అథర్వ టైడే (12 నాటౌట్), కరుణ్​ నాయర్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. బ్యాట్​తో రెచ్చిపోయిన శార్దూల్ బాల్​తోనూ సత్తా చాటుతున్నాడు. ధృవ్ షోరే (0)ను ఔట్ చేసి మూడో ఓవర్​లోనే ముంబైకి బ్రేక్ త్రూ అందించాడు. మరో బ్యాటర్ అమన్ మఖ్కోడే (8)ని ధవళ్ కులకర్ణి ఔట్ చేశాడు. మరి.. రంజీ ఫైనల్​లో శార్దూల్ తుఫాన్ ఇన్నింగ్స్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బ్రేకింగ్‌: రాజకీయాల్లోకి క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌! ఆ పార్టీ నుంచి MPగా పోటీ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి