Idream media
Idream media
ఇటీవల మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారంటూ బాలయ్యను హిందూపురంలో విద్యార్థులు, వైస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్న తర్వాత నేను గాని ఒక్క కనుసైగ చేశానంటే.. అంటూ బాలయ్య కొట్టిని సినిమా డైలాగ్లు అధికార వైఎస్సార్సీపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. తన సహ నటి నుంచే బాలయ్యకు కనుసైగ విషయంలో సలహాలొస్తున్నాయి. తన తండ్రి ఎన్టీఆర్కు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుకు ఒక్క కనుసైగ చేసి బుద్ధి చెప్పి ఉండాల్సిందని బాలయ్యకు రోజా సలహా ఇచ్చారు.
పనిలో పనిగా ఎమ్మెల్యే రోజా.. బాలయ్యకు హెచ్చరికలు జారీ చేశారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, బాలయ్యలను రాయలసీమ ప్రజలు తరిమికొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు. లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం మండలి రద్దును చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు.
స్నేహం, రాజకీయం రెండూ వేరని ఎమ్మెల్యే రోజా మరో మారు నిరూపించారు. ఇటీవల మండలి చివరి రోజు సమావేశాల్లో బాలయ్యతో కలసి రోజా సెల్ఫీ దిగి సినిమాల్లో విజయవంతమైన జోడీగా మరో మారు అభిమానులకు గుర్తు చేశారు. ఆ సెల్ఫీ రోజానే తిసినట్లుగా ఫొటోను చూస్తే అర్థమవుతోంది. ఇంతలోనే బాలయ్యపై రోజా ఫైర్ అయి.. రాజకీయాలు వేరు, స్నేహం వేరనేలా సందేశం ఇచ్చారు.